PM Modi: మహ కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొనే పూర్తి షెడ్యూల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 5న ఆయన త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం.
ఈమేరకు ప్రధాని షెడ్యూల్ను ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి చెప్పినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్కు వెళ్తారు.
ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు.
Details
గంగా నదికి పూజలు చేయనున్న మోదీ
ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరిస్తారు. 11.45 గంటలకు బోటులో తిరిగి అరైల్ ఘాట్కు వెళ్తారు.
అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు వెళ్లి దిల్లీ బయల్దేరుతారని సదరు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించినట్లు ఆ కథనాల సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరని తెలుస్తోంది. కేవలం పుణ్యస్నానం ఆచరించి గంగానదికి పూజలు చేయనున్నారని సమాచారం.
దాదాపు గంటన్నర పాటు మోదీ ప్రయాగ్రాజ్లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే నగరంతో పాటు కుంభమేళా వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
Details
ప్రధాని వెంట యూపీ ముఖ్యమంత్రి
ప్రధాని వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండనున్నారట. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
రూ.5500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
144 ఏళ్లకోసారి వచ్చే జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే దాదాపు 35 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు.