NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!
    తదుపరి వార్తా కథనం
    New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!
    ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు.. అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!

    New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాంతాల నుంచి దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

    ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అధికారికంగా ప్రకటించారు.

    రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖపట్నం - అబుదాబి మధ్య నేరుగా విమాన సర్వీసులు జూన్‌ 13నుంచి ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు.

    ఈ ఫ్లైట్స్‌ వారానికి నాలుగు రోజులు నడవనున్నాయని వివరించారు. ఇది అంతర్జాతీయ కనెక్టివిటీ విషయంలో విశాఖకు పెద్ద ఆస్తిగా నిలవనుంది.

    Details

     విజయవాడ - బెంగళూరుకు జూన్ 2 నుంచి సర్వీసులు ప్రారంభం

    ఇదే విధంగా విశాఖపట్నం - భువనేశ్వర్‌ మధ్య నేరుగా విమాన సర్వీసు జూన్‌ 12 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

    ఇది ఆంధ్రప్రదేశ్‌ - ఒడిశా రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

    అలాగే విజయవాడ - బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసులు జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

    ఈ సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని ప్రాంతానికి ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరుతో మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

    ఈ మూడు రూట్లలో కొత్తగా ప్రారంభమయ్యే విమాన సర్వీసులు రాష్ట్ర ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే కాకుండా, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కూడా ప్రోత్సహించనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    తాజా

    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు
    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు తెలంగాణ
    Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశాంగశాఖ
    Swiggy Q4 results: క్విక్‌ కామర్స్‌‌పై దృష్టి.. స్విగ్గీ నష్టం డబుల్‌! స్విగ్గీ

    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు  కేంద్ర పౌర విమానయాన శాఖ
    Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు రాజమహేంద్రవరం
    Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు  విజయనగరం
    Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్ బాంబు బెదిరింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025