NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!
    తదుపరి వార్తా కథనం
    New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!
    ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు.. అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!

    New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు..అబుదాబి, బెంగళూరు,భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రానికి చెందిన పలు కీలక ప్రాంతాల నుంచి దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

    ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అధికారికంగా ప్రకటించారు.

    రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖపట్నం - అబుదాబి మధ్య నేరుగా విమాన సర్వీసులు జూన్‌ 13నుంచి ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు.

    ఈ ఫ్లైట్స్‌ వారానికి నాలుగు రోజులు నడవనున్నాయని వివరించారు. ఇది అంతర్జాతీయ కనెక్టివిటీ విషయంలో విశాఖకు పెద్ద ఆస్తిగా నిలవనుంది.

    Details

     విజయవాడ - బెంగళూరుకు జూన్ 2 నుంచి సర్వీసులు ప్రారంభం

    ఇదే విధంగా విశాఖపట్నం - భువనేశ్వర్‌ మధ్య నేరుగా విమాన సర్వీసు జూన్‌ 12 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

    ఇది ఆంధ్రప్రదేశ్‌ - ఒడిశా రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

    అలాగే విజయవాడ - బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసులు జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

    ఈ సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని ప్రాంతానికి ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరుతో మెరుగైన అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

    ఈ మూడు రూట్లలో కొత్తగా ప్రారంభమయ్యే విమాన సర్వీసులు రాష్ట్ర ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే కాకుండా, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కూడా ప్రోత్సహించనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    కింజరాపు రామ్మోహన్ నాయుడు

    Bharatiya Vayuyan Vidheyak 2024: బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో కొత్త ఏవియేషన్ బిల్లు  కేంద్ర పౌర విమానయాన శాఖ
    Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్‌ నాయుడు రాజమహేంద్రవరం
    Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు  విజయనగరం
    Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్ బాంబు బెదిరింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025