NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం 
    భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం

    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి.

    భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడులతో పాకిస్థాన్‌ గట్టిగా షాక్‌కు గురై, తన ఉనికిని రుజువు చేసేందుకు అన్ని మార్గాలలో ప్రయత్నాలు చేస్తోంది.

    ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది.

    ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక ప్రజల భద్రత కోసం అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో, అక్కడ నివసిస్తున్న వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో,భారతీయ రైల్వే ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

    వివరాలు 

    సరిహద్దుకు సమీపంలో విద్యుత్‌ నిలిపివేసి బ్లాక్‌అవుట్‌ అమలులోకి..

    జమ్మూ, ఉధంపుర్‌ ప్రాంతాల నుంచి దేశ రాజధాని దిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లను ప్రారంభించేందుకు యోచిస్తోంది.

    దేశ సరిహద్దుల్లో నెలకొన్న అస్థిరతను, ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

    'ఆపరేషన్‌ సిందూర్‌' తర్వాత సరిహద్దు పరిస్థితులు మరింత ఉద్రిక్తతను సంతరించుకున్నాయి.

    పాకిస్థాన్‌ ప్రయోగించిన ఎనిమిది మిసైళ్లను భారత సైన్యం సమర్థంగా నిరోధించి, వాటిని గాలిలోనే ఛేదించింది.

    జమ్మూ జిల్లాలో మోతాదైన భద్రత చర్యలలో భాగంగా అలర్ట్‌ సైరన్లు వినిపించాయి.

    ప్రజలు బయటకు రావద్దని, ఇంటి లోపలే ఉండాలని భారత సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.

    అంతేకాదు, సరిహద్దుకు సమీపంలోని కొన్ని నగరాల్లో విద్యుత్‌ నిలిపివేసి బ్లాక్‌అవుట్‌ అమలులోకి తెచ్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భారతీయ రైల్వే కీలక నిర్ణయం

    भारतीय रेलवे ने जम्मू और उधमपुर से दिल्ली के लिए तीन विशेष ट्रेनें चलाने का निर्णय लिया है। यह कदम वर्तमान हालात को ध्यान में रखते हुए यात्रियों की सुरक्षा और सुविधा सुनिश्चित करने के लिए उठाया गया है। टिकट IRCTC वेबसाइट और रेलवे काउंटर से बुक करें।#IndianRailways… pic.twitter.com/SBqnwY251k

    — Bharatwide News Network (@BharatwideNews) May 9, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025