NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi : దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు..?: కాంగ్రెస్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi : దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు..?: కాంగ్రెస్ 
    దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు..?: కాంగ్రెస్

    Delhi : దిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు..?: కాంగ్రెస్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 16, 2025
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

    అలాంటి సంక్షోభ పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

    మరణాలు, గాయపడిన వారి సంఖ్యను తక్షణమే ప్రకటించి, అలాగే తప్పిపోయినవారి గురించి కేంద్రం స్పష్టమైన సమాచారం అందించాలని కోరారు.

    ఖర్గే ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, మృతులు, గాయపడిన వారి సంఖ్యను వీలైనంత త్వరగా వెల్లడించాలన్నారు. తప్పిపోయిన వారి గుర్తింపును కూడా నిర్ధారించాలన్నారు.

    గాయపడిన వారికి తక్షణ వైద్య సాయమందించి, బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందించాలని పేర్కొన్నారు.

    Details

    మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

    కాంగ్రెస్ అధినేత బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేంద్రం ఈ ఘటనపై పూర్తిస్థాయి సమాచారం బయటపెట్టలేదని ఆరోపించారు.

    బాధ్యులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ఖర్గే ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో చాలా మంది మరణించారని వినడం బాధాకరం.

    ఆ స్టేషన్ నుండి వెలువడిన వీడియోలు హృదయ విదారకంగా ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

    కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కూడా ఈ ఘటనపై స్పందించారు. న్యూదిల్లీ స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

    Details

    పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గుమిగూడడం వల్లే ఈ ప్రమాదం

    రాబోయే కుంభమేళా సందర్భంగా మెరుగైన ఏర్పాట్లు చేపట్టాల్సిందని సూచించారు. దాదాపు డజను మంది గాయపడ్డారని, వారిని ఎవరికి తోచిన విధంగా పార్శిల్ వాహనాల్లో ఆసుపత్రికి తరలించారని తెలిపారు.

    శనివారం న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ భారీ తొక్కిసలాటలో దాదాపు 18 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.

    రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.పి.ఎస్ మల్హోత్రా ప్రకారం, ప్లాట్‌ఫామ్ నంబర్ 1 వద్ద పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గుమిగూడడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.

    ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ 14 పై నిలబడి ఉండగా, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్ల ఆలస్యం కారణంగా 12, 13, 14 ప్లాట్‌ఫామ్‌ల వద్ద భారీ రద్దీ ఏర్పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    దిల్లీ
    మల్లికార్జున ఖర్గే

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన నరేంద్ర మోదీ
    Congress: 'బ్యాడ్జ్ ఆఫ్ హానర్'.. రాహుల్ గాంధీ కేసుపై కాంగ్రెస్   భారతదేశం
    Rahul Gandhi: కులగణన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు రాహుల్ గాంధీ
    Mallikarjun Kharge: ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే మల్లికార్జున ఖర్గే

    దిల్లీ

    Delhi Elections: దిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్‌ భారతదేశం
    Ayushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్‌ సర్కార్‌కు ఊరట భారతదేశం
    AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ అరవింద్ కేజ్రీవాల్
    #NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వం

    మల్లికార్జున ఖర్గే

    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే బెంగళూరు
    ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్
    Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు ప్రతిపక్షాలు
    రెండో రోజూ రూల్స్ 267, 176లపై దుమారం.. ప్రధానికి ఖర్గే ఘాటు ప్రశ్నలు కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025