NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం.. అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ రైలు నుండి వేరైన 2 కోచ్‌లు 
    తదుపరి వార్తా కథనం
    Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం.. అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ రైలు నుండి వేరైన 2 కోచ్‌లు 
    గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం

    Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం.. అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ రైలు నుండి వేరైన 2 కోచ్‌లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 15, 2024
    02:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం డబుల్ డెక్కర్ రైలు కోచ్‌లు విడిపోవడంతో భారీ రైలు ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

    వడోదర డివిజన్‌లోని గోతంగం యార్డ్ సమీపంలో ఉదయం 8:50 గంటలకు ప్రమాదం జరిగింది. ఇక్కడ 12932 అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 2 కోచ్‌లు రైలు నుండి వేరు అయ్యాయి.

    ప్రమాదం తర్వాత గందరగోళం నెలకొంది. పశ్చిమ రైల్వే అధికారులు, ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు ప్రారంభించారు.

    వివరాలు 

    అహ్మదాబాద్, ముంబై రూట్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

    ఘటన అనంతరం డబుల్ డెక్కర్ రైలులోని ప్రయాణికులు కిందకు దిగి పట్టాలపై నిలబడ్డారు. ఈ క్రమంలో అహ్మదాబాద్, ముంబై రూట్లలో రైళ్ల రాకపోకలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది.

    11:37 గంటలకు, పశ్చిమ రైల్వే మరమ్మతు పనులు పూర్తి చేసి, మెయిన్ లైన్‌లో ట్రాఫిక్‌ను పునరుద్ధరించినట్లు సమాచారం.

    కోచ్‌లు విడిపోవడానికి కప్లర్ విరిగిపోవడమే కారణం. విచారణ కొనసాగుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాదం జరిగిన తర్వాత రైలు నుంచి దిగిన  ప్రయాణికులు 

    @RailMinIndia @IndianRailMedia @RailMinIndia
    Please look into this matter
    Train No.12935(mmct double decker) which is running today from ahmedabad to mumbai central
    Nearby Surat The coaches of the train fall apart accidentally in the running train
    We are facing many issues here pic.twitter.com/Xw1Wd1Maib

    — Mohit goyal (@2001mohitgoyal) August 15, 2024

    సమాచారం 

    మధ్యప్రదేశ్‌లో కూడా ప్రమాదం 

    మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో గురువారం కూడా రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ, అస్లానా ప్రాంతంలోని పథారియా సమీపంలో గూడ్స్ రైలు 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన
    BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం  సుప్రీంకోర్టు
    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ.. రణ్‌ధీర్‌ జైస్వాల్‌
    Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె? అనితా ఆనంద్

    గుజరాత్

    Gujrat: గుజరాత్ లో కోతులు పేగును చీల్చడంతో బాలుడు మృతి  భారతదేశం
    Unseasonal Rain: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు.. గుజరాత్‌లో 20మంది మృతి భారీ వర్షాలు
    Surat Fire Accident: సూరత్ కెమికల్ ప్లాంట్‌లో మంటలు.. గాయపడిన 24 మంది కార్మికులు  సూరత్
    America Triple Murder: అమెరికాలో భారతీయ విద్యార్థిపై ట్రిపుల్ మర్డర్ కేసు  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025