Page Loader
Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం.. అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ రైలు నుండి వేరైన 2 కోచ్‌లు 
గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం

Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం.. అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ రైలు నుండి వేరైన 2 కోచ్‌లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 15, 2024
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం డబుల్ డెక్కర్ రైలు కోచ్‌లు విడిపోవడంతో భారీ రైలు ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వడోదర డివిజన్‌లోని గోతంగం యార్డ్ సమీపంలో ఉదయం 8:50 గంటలకు ప్రమాదం జరిగింది. ఇక్కడ 12932 అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 2 కోచ్‌లు రైలు నుండి వేరు అయ్యాయి. ప్రమాదం తర్వాత గందరగోళం నెలకొంది. పశ్చిమ రైల్వే అధికారులు, ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు ప్రారంభించారు.

వివరాలు 

అహ్మదాబాద్, ముంబై రూట్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఘటన అనంతరం డబుల్ డెక్కర్ రైలులోని ప్రయాణికులు కిందకు దిగి పట్టాలపై నిలబడ్డారు. ఈ క్రమంలో అహ్మదాబాద్, ముంబై రూట్లలో రైళ్ల రాకపోకలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది. 11:37 గంటలకు, పశ్చిమ రైల్వే మరమ్మతు పనులు పూర్తి చేసి, మెయిన్ లైన్‌లో ట్రాఫిక్‌ను పునరుద్ధరించినట్లు సమాచారం. కోచ్‌లు విడిపోవడానికి కప్లర్ విరిగిపోవడమే కారణం. విచారణ కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదం జరిగిన తర్వాత రైలు నుంచి దిగిన  ప్రయాణికులు 

సమాచారం 

మధ్యప్రదేశ్‌లో కూడా ప్రమాదం 

మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో గురువారం కూడా రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ, అస్లానా ప్రాంతంలోని పథారియా సమీపంలో గూడ్స్ రైలు 4 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు.