Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి
బిహార్లోని సుపాల్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్ కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది.శిథిలాల కింద 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు. జిల్లా అధికారి ఒకరు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రూ.1700 కోట్లకుపైగా అంచనా వ్యయంతో కోసి నదిపై భగల్పూర్, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2014లో శంకుస్థాపన చేశారు. .