NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / gali janardhan reddy case: ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    gali janardhan reddy case: ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు!
    ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు!

    gali janardhan reddy case: ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 29, 2025
    10:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం సాధారణమే అయినా, ఒకే కేసులో ఒకే రోజున ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోవడం అరుదైన సంఘటన.

    ఈ అసాధారణ పరిణామానికి తెలంగాణ హైకోర్టు వేదికగా మారింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషులుగా భావించిన వ్యక్తులు హైకోర్టులో అప్పీళ్లను దాఖలు చేయగా, విచారణకు వచ్చిన మూడుగురు న్యాయమూర్తులు వరుసగా విచారణ నుంచి తప్పుకున్నారు.

    సీబీఐ కోర్టు మే 6న ఓబుళాపురం కేసులో ఏడేళ్ల శిక్ష విధించిన తీర్పుపై గాలి జనార్దన్‌రెడ్డి, బి.వి.శ్రీనివాసరెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజ్ అలీఖాన్, వి.డి.రాజగోపాల్‌లు హైకోర్టులో శిక్ష సస్పెన్షన్ కోసం పిటిషన్‌లు దాఖలు చేశారు.

    ఇందులో గాలి జనార్దన్‌రెడ్డి త‌న శిక్షను పూర్తిగా రద్దు చేయాలని ప్రత్యేకంగా కోరారు.

    Details

    బెయిల్ మంజూరు చేయాలని వాదనలు

    ఈ నెల 21న మొదటిగా జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టారు.

    సీనియర్ న్యాయవాదులు మూడున్నరేళ్లకుపైగా దోషులు జైల్లో గడిపిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, తక్షణ శిక్ష నిలిపివేతతోపాటు బెయిలు మంజూరు చేయాలని వాదించారు.

    అయితే, సీబీఐ స్పందన లేకుండా ఉత్తర్వులివ్వలేమంటూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

    బుధవారం ఈ పిటిషన్‌లు జస్టిస్ కె. శరత్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చాయి.

    అయితే ఉదయం కోర్టు ప్రారంభ సమయంలోనే ఆయన ఈ కేసులను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

    తర్వాత ఇవే కేసులు జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ముందు విచారణకు రావడంతో ఆయన సాయంత్రం 7 గంటల సమయంలో విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

    Details

    విచారణ జరగలేదు

    దీంతో న్యాయవాదులు ఈ కేసులను సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఇద్దరు న్యాయమూర్తులు ఇప్పటికే తప్పుకున్న నేపథ్యంలో తాను విచారణ చేపట్టాలని కోరారు.

    ఫైళ్లు పరిశీలించిన జస్టిస్ భీమపాక, ఇవి ఓబుళాపురం కేసుతో సంబంధం ఉన్నాయనీ, తాను కూడా విచారణ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు.

    ఈ పరిణామాలతో, గాలి జనార్దన్‌రెడ్డితో పాటు మిగతా దోషుల పిటిషన్‌ల విచారణ వారం పాటు వాయిదా పడింది.

    ఈ కేసులో వాదనలు వినిపించేందుకు దోషుల తరఫున న్యాయవాదులు వాసిరెడ్డి విమల్‌వర్మ,నాగముత్తు, పప్పు నాగేశ్వరరావు, సురేశ్, బి.నళిన్‌కుమార్‌లు పాల్గొనగా, సీబీఐ తరఫున శ్రీనివాస్ కపాటియా హాజరయ్యారు.

    ఉదయం నుంచి రాత్రి 7.30 గంటల దాకా వారు కోర్టులో వేచి కూర్చున్నా, విచారణ జరగలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైకోర్టు
    తెలంగాణ

    తాజా

    Online Registration of Property: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 117 ఏళ్ల నాటి చట్టానికి స్వస్తి.. కేంద్రం కొత్తచట్టం కేంద్ర ప్రభుత్వం
    gali janardhan reddy case: ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు! హైకోర్టు
    Andhrapradesh: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు ఆంధ్రప్రదేశ్
    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల అరెస్టు.. గ్రెనేడ్‌లు,మందుగుండు సామగ్రి స్వాధీనం జమ్ముకశ్మీర్

    హైకోర్టు

    AP High Court: హైకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యం.. నలుగురు ఐఏఎస్‌లకు వారెంట్లు ఆంధ్రప్రదేశ్
    High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్
    Actor Darshan: అభిమాని హత్య కేసులో దర్శన్‌కు మధ్యంతర బెయిల్  కోలీవుడ్
    Darshan : చికిత్స కోసం బెంగళూరులో దర్శన్.. అభిమానులతో తూముకూరులో ఉద్రిక్తతలు కోలీవుడ్

    తెలంగాణ

    Telangana: మినీ అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు! భారతదేశం
    Hyderabad:వివిధ అంశాలలో పరీక్షలు.. ఇదీ 'మిస్‌ వరల్డ్‌' పోటీల తీరూతెన్నూ.. భారతదేశం
    MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం భారతదేశం
    Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025