NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్ 
    తదుపరి వార్తా కథనం
    రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్ 
    నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్

    రూ.2 కోట్లు ఇవ్వకుంటే నరేంద్ర మోదీని, అమిత్ షాను చంపేస్తామని బెదిరింపు కాల్స్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 21, 2023
    06:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తాను అడిగిన డబ్బులు ఇవ్వకుంటే ఏకంగా ప్రధాన మంత్రి, హోంశాఖ మంత్రిని చంపుతామని గుర్తు తెలియని వ్యక్తి దిల్లీ పోలీసులను బెదిరించాడు.దీనిపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్ చేసిన వ్యక్తి ఎవరో కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

    వీరితో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్ నూ చంపేస్తామని, అదే స్థాయి బెదిరింపులు రావడం పోలీసులను ఆందోళనకు గురిచేసింది.

    దిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసిన అజ్ఞాత వాసిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. బుధవారం ఉదయం 10:46 గంటల సమయంలో దిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు.

    తనకు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకుంటే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను చంపేస్తామని బెదిరించాడు.

    DETAILS

    ఆ అజ్ఞాత వాసిని వడ్రంగి సుధీర్ వర్మగా గుర్తింపు

    దీనిపై ఆరా తీసిన దిల్లీ పోలీసులు, సదరు ఫోన్ కాల్ నాంగ్లోయీ ప్రాంతం నుంచి వచ్చిందని గుర్తించారు.

    అయితే మరోసారి ఉధయం 10:54 గంటల సమయంలో మళ్లీ అదే వ్యక్తి ఫోన్ చేశాడు. ఈసారి రూ.2 కోట్లు కావాలని, లేని పక్షంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హతమారుస్తామన్నాడు.

    ఈ క్రమంలో వివరాలు సేకరించిన పోలీసులు, ఆ ఫోన్ పశ్చిమ విహార్ (ఈస్ట్) నుంచి వచ్చిందన్నారు.

    అనంతరం పశ్చిమ విహార్ ఈస్ట్ ప్రాంతానికి వెళ్లి నిందితుడి కోసం గాలించారు. ఫోన్ చేసిన వ్యక్తిని వడ్రంగి మేస్త్రి సుధీర్ వర్మగా గుర్తించామని దిల్లీ డీసీపీ హరేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ప్రధాన మంత్రి
    అమిత్ షా

    తాజా

    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా

    దిల్లీ

    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  భారతదేశం
    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  నరేంద్ర మోదీ
    16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్  హత్య
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక హత్య

    ప్రధాన మంత్రి

    పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరం.. 19 పార్టీలు ఉమ్మడి ప్రకటన రాష్ట్రపతి
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  అమిత్ షా
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన నరేంద్ర మోదీ

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025