NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nilam Shinde: కోమాలో ఉన్న విద్యార్థిని నీలం షిండే తల్లిదండ్రులకు యూఎస్ వీసా మంజూరు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Nilam Shinde: కోమాలో ఉన్న విద్యార్థిని నీలం షిండే తల్లిదండ్రులకు యూఎస్ వీసా మంజూరు 
    కోమాలో ఉన్న విద్యార్థిని నీలం షిండే తల్లిదండ్రులకు యూఎస్ వీసా మంజూరు

    Nilam Shinde: కోమాలో ఉన్న విద్యార్థిని నీలం షిండే తల్లిదండ్రులకు యూఎస్ వీసా మంజూరు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 28, 2025
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న భారతీయ విద్యార్థిని నీలం షిండేను చూడటానికి ఆమె తల్లిదండ్రులకు అత్యవసరంగా అమెరికా రాయబార కార్యాలయం వీసా మంజూరు చేసింది.

    ఈ పరిణామంతో నీలం షిండే తల్లిదండ్రులు అమెరికా వెళ్లనున్నారు.

    నీలం షిండే (35) గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో చదువుకుంటోంది.

    అయితే, ఈ నెల 14న ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

    అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. నీలం మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందినవారు.

    వివరాలు 

    పోలీసుల  అదుపులో నిందితుడు 

    తన కుమార్తెను చూసేందుకు నీలం తల్లిదండ్రులు వీసా కోసం ప్రయత్నించారు, కానీ మంజూరు కాలేదు.

    ఈ పరిస్థితిని గమనించిన లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే జోక్యం చేసుకుని, తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

    ఈ మేరకు ఆమె ఎక్స్ (ట్విట్టర్) ద్వారా విజ్ఞప్తి చేశారు.

    ఇక, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ప్రమాదం అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

    అయితే, పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16న ప్రమాదం జరిగిందని నీలం తండ్రి తనాజీ షిండే తెలిపారు.

    అప్పటి నుంచి వీసా కోసం ప్రయత్నిస్తున్నామైనా, ఇప్పటి వరకు మంజూరవలేదని ఆయన వాపోయారు.

    వివరాలు 

    నీలం కుటుంబానికి అండగా ఉంటాం: సుప్రియా సూలే

    ఈ ఘటనపై ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే స్పందించి,విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సహాయంతో తల్లిదండ్రులకు వీసా ఇప్పించడానికి ప్రయత్నించారు.

    కేంద్ర ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

    నీలం కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

    ఈ ప్రమాదంలో నీలం కాళ్లు, చేతులు విరిగిపోవడంతో పాటు, తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

    దాంతో, ఆమె కోమాలోకి వెళ్లింది. నీలం గత నాలుగేళ్లుగా అమెరికాలో చదువుకుంటూ, ఈ ఏడాదితో తన విద్యను పూర్తి చేసుకోవాల్సి ఉండగా, ఈ ప్రమాదం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Covid Cases: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. 65 మంది మృతి! కోవిడ్
    Starlink Kit: స్టార్‌లింక్‌ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే? స్టార్‌లింక్‌
    Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? గూగుల్
    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్

    మహారాష్ట్ర

    Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రకటించిన బీజేపీ  భారతదేశం
    Maharastra: గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి భారతదేశం
    Kalidas Kolambkar: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్‌ కొలాంబ్‌కర్‌ భారతదేశం
    Eknath Shinde: మహారాష్ట్రలో రాజకీయాల్లో ఉత్కంఠ.. హోంశాఖపై ఏక్‌నాథ్ షిండే కన్ను! ఏక్‌నాథ్ షిండే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025