NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indian Student: కోమాలో భారతీయ విద్యార్థిని.. కేంద్రం చొరవతో అత్యవసర వీసా ఇంటర్వ్యూకు అమెరికా ఓకే
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Indian Student: కోమాలో భారతీయ విద్యార్థిని.. కేంద్రం చొరవతో అత్యవసర వీసా ఇంటర్వ్యూకు అమెరికా ఓకే
    కోమాలో భారతీయ విద్యార్థిని.. కేంద్రం చొరవతో అత్యవసర వీసా ఇంటర్వ్యూకు అమెరికా ఓకే

    Indian Student: కోమాలో భారతీయ విద్యార్థిని.. కేంద్రం చొరవతో అత్యవసర వీసా ఇంటర్వ్యూకు అమెరికా ఓకే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2025
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోమాలో ఉన్న భారతీయ విద్యార్థినికి సంబంధించి ఆమె కుటుంబం చేసిన విజ్ఞప్తికి అమెరికా నుంచి స్పందన వచ్చింది.

    భారత ప్రభుత్వం తీసుకున్న చర్చల ఫలితంగా, యూఎస్ అధికారులు అత్యవసర వీసా ఇంటర్వ్యూకు అనుమతి ఇచ్చారు.

    ఈ మేరకు శుక్రవారం ఉదయం 9 గంటలకు వీసా ఇంటర్వ్యూకు స్లాట్ కేటాయించారు.

    బాధితురాలి తండ్రి వీసా కోసం చేసిన ప్రయత్నాలు భారత విదేశాంగశాఖ దృష్టికి రావడంతో, అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

    దీనిపై అమెరికా సానుకూలంగా స్పందించింది.

    వివరాలు 

    లమ్ షిండే ఫిబ్రవరి 14న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు

    అత్యవసర ప్రయాణ అనుమతి లేక వీసా మంజూరు చేయాలని భారత విదేశాంగ శాఖకు చెందిన అమెరికా విభాగం అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం.

    కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న నీలమ్ షిండే ఫిబ్రవరి 14న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

    కారు ఢీకొనడంతో ఆమె తల, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉంటున్న ఆమె కుటుంబానికి ఈ సమాచారం ఫిబ్రవరి 16న అందింది.

    నీలమ్ తండ్రి వెంటనే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా, అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

    నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ - ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరి దృష్టికి వచ్చింది.

    వివరాలు 

    ఎంపీ సుప్రియా సూలే విజ్ఞప్తి

    "నీలమ్ శిందే అనే విద్యార్థిని అమెరికాలో ప్రమాదానికి గురై అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆమె తండ్రి కుమార్తె వద్దకు వెళ్లాలనుకుంటున్నారు. అందుకే అత్యవసర వీసా కోసం దరఖాస్తు చేశారు. ఆయనకు వెంటనే సహాయం చేయాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, భారత దౌత్య కార్యాలయాన్ని కోరుతున్నాను" అని ఆమె ఎక్స్ (Twitter) వేదికగా తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    మహారాష్ట్ర

    Maharastra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం: నివేదిక భారతదేశం
    Maharastra: బీజేపీ 22, సేన 12: మంత్రి పదవుల కోసం మహారాష్ట్ర పవర్ షేర్ ఫార్ములా ! భారతదేశం
    Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రకటించిన బీజేపీ  భారతదేశం
    Maharastra: గవర్నర్‌తో షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వినతి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025