NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Marco rubio: 'ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించండి': భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Marco rubio: 'ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించండి': భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో
    భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో

    Marco rubio: 'ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించండి': భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    11:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్‌, పాకిస్థాన్‌ పరస్పరం ప్రయత్నించాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హితవు పలికారు.

    ఈ నేపథ్యంలో ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌లతో టెలిఫోన్‌ ద్వారా మాట్లాడారు.

    అవసరమైతే భారత్‌-పాకిస్తాన్‌ మధ్య చర్చలకు తాను మధ్యవర్తిగా ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు.

    అయితే ఉగ్రవాదానికి తాము ఏమాత్రం అవకాశమివ్వబోమని, దానిని ఖచ్చితంగా ఖండిస్తామని స్పష్టంచేశారు.

    వివరాలు 

    పాక్‌ మిసైళ్లను, డ్రోన్లను సమర్థంగా నియంత్రిస్తున్న భారత రక్షణ వ్యవస్థ

    ఇక మరోవైపు, పాకిస్థాన్‌ తరఫున మిసైళ్లతో పాటు ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించి దాడులు జరిపే యత్నంతో భారత-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి.

    ముఖ్యంగా జమ్మూ, అఖ్నూర్‌, పఠాన్‌కోట్‌, ఉదంపూర్‌, జైసల్మేర్‌ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాక్‌ ప్రయత్నించినట్టు సమాచారం.

    అయితే భారత రక్షణ వ్యవస్థ చురుకుగా స్పందించి పాక్‌ మిసైళ్లను, డ్రోన్లను సమర్థంగా నియంత్రిస్తోంది.

    ఇప్పటికే రెండు పాక్‌ యుద్ధ విమానాలను కూల్చివేశామని నివేదికలు తెలియజేస్తున్నాయి. అందులో ఒకటిని ఎఫ్-16గా గుర్తించారు.

    వివరాలు 

    మారుతున్న పరిస్థితులను  నిశితంగా గమనిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

    ఈ మారుతున్న పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా గమనిస్తున్నారు.

    భద్రతా రంగంలో త్రివిధ దళాధిపతులు ఈ విషయంపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.

    భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఈ సంక్లిష్ట పరిస్థితులపై ప్రధానికి సమగ్ర వివరాలు అందించారు.

    అంతేకాకుండా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ టెలిఫోన్‌ ద్వారా మాట్లాడారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Marco rubio: 'ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించండి': భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో అమెరికా
    Pakistan: రాజస్థాన్‌లో పాకిస్తాన్ పైలట్‌ పట్టుకున్ననిఘా వర్గాలు  రాజస్థాన్
    Vatican City : కొత్త పోప్ ఎన్నికైనట్లు వెల్లడించిన వాటికన్  వాటికన్ సిటీ
    IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్‌, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ అర్ధాంతరంగా రద్దు  ఐపీఎల్

    అమెరికా

    #NewsBytesExplainer: తెలుగు వాళ్లను పెద్ద ఎత్తున తీసేసిన అమెరికా దిగ్గజ సంస్థ 'ఫ్యానీ మే' అంతర్జాతీయం
    Plane Hijack: బెలిజ్‌లో విమానం హైజాక్‌కు యత్నం.. దుండగుడిని కాల్చిన ప్రయాణికుడు అంతర్జాతీయం
    USA: పంజాబ్‌లో 14 గ్రెనేడ్ దాడులకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్ హ్యాపీ పాసియా.. అమెరికాలో అరెస్ట్..! పంజాబ్
    Trump- Zelensky: అమెరికాతో ఖనిజాల ఒప్పందం దిశగా తొలి అడుగు.. ప్రకటించిన ఉక్రెయిన్‌  ఉక్రెయిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025