NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vasireddy Padma: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన మరో కీలక నేత..
    తదుపరి వార్తా కథనం
    Vasireddy Padma: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన మరో కీలక నేత..
    వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన మరో కీలక నేత..

    Vasireddy Padma: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన మరో కీలక నేత..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2024
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్సార్‌సీపీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.

    ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే.

    తాజాగా, మరో సీనియర్ మహిళా నేత అయిన మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది.

    ఆమె ఇవాళ అధికారికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనుందని ప్రచారం జరుగుతోంది.

    ఈ సందర్భంగా ఆమె వైఎస్సార్‌సీపీని వీడటానికి కారణాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.

    వివరాలు 

    జగ్గయ్య పేట ఇంచార్జ్ పదవి కోసం ఆశ  

    ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత వాసిరెడ్డి పద్మ ప్రజలకు కనిపించడం లేదు.. ఆమె వైఎస్సార్‌సీపీ కార్యక్రామాలకు దూరంగా ఉంటున్నారు.

    వాసిరెడ్డి పద్మ పార్టీని వీడటానికి సంబంధించిన కారణాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

    ఎన్నికల సమయంలో ఆమె జగ్గయ్యపేట సీటు కోసం ఆశపడినట్లు తెలుస్తోంది, కానీ ఆ అవకాశాన్ని పొందలేదు.

    ఇటీవల, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైఎస్సార్‌సీపీని వీడి జనసేన పార్టీలో చేరడంతో నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఖాళీగా మారింది.

    వాసిరెడ్డి పద్మకు జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇంఛార్జ్ పదవి అందుతుందని భావించినా, వై.ఎస్.జగన్ తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    వివరాలు 

    మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా

    మునుపటి ఎన్నికల క్రమంలో, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

    ఆమె జగ్గయ్యపేట టికెట్ కోసం ఆశపడినా, దక్కకపోవడంతోనే రాజీనామా చేసినట్లు అప్పట్లో చర్చ జరిగింది.

    అసెంబ్లీ ఎన్నికలలో తనకు లేదా తన భర్తకు టికెట్ కేటాయించాలని ఆమె అధిష్టానానికి వినతులు పంపినట్లు సమాచారం.

    అయితే, అధిష్టానం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.

    అయితే, తన పదవికి రాజీనామా చేసినా, సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆమె పేర్కొన్నారు.

    ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన మాత్రమే తన రాజీనామాకు కారణం కాదని, అయితే కొందరు అలా భావించవచ్చు అన్నారు.

    వివరాలు 

    ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలలోకి..

    ఆమె తనకు సీటు వస్తుందా లేదా అనేది ప్రాధాన్యత కాదని, పార్టీ ఆదేశించినా లేదా ఆదేశించకపోయినా తను అన్ని విషయాలకు సిద్ధమని తెలిపారు.

    ఇక వాసిరెడ్డి పద్మ రాజకీయాల్లోకి ప్రవేశించడం మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరడం ద్వారా జరిగిందని అందరికీ తెలిసిందే.

    2009 ఎన్నికల తరువాత ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కొంతకాలం ఆమె సైలెంట్ గా ఉన్నారు.

    తరువాత,వైఎస్సార్‌సీపీలో చేరి అధికార ప్రతినిధిగా పనిచేశారు.2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆమెకు జగన్ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి దక్కింది.

    ప్రస్తుతం,ఆమె వైఎస్సార్‌సీపీని వీడటానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.ఆమె ఈ పార్టీని వీడి మరో పార్టీలో చేరతారా లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా అన్నది చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు అంబటి రాంబాబు
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025