NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ.. ప్రభుత్వానికి డెయిరీ యాజమాన్యం ప్రతిపాదనలు
    తదుపరి వార్తా కథనం
    Telangana: విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ.. ప్రభుత్వానికి డెయిరీ యాజమాన్యం ప్రతిపాదనలు
    విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ.. ప్రభుత్వానికి డెయిరీ యాజమాన్యం ప్రతిపాదనలు

    Telangana: విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ.. ప్రభుత్వానికి డెయిరీ యాజమాన్యం ప్రతిపాదనలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 06, 2025
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) పాల సేకరణ ధరల మార్పును పరిశీలిస్తోంది.

    గేదె పాల ధరను లీటరుకు ₹3 పెంచాలని, అయితే ఆవు పాల సేకరణ ధరను ₹2 నుంచి ₹3 వరకు తగ్గించాలని డెయిరీ యాజమాన్యం ప్రతిపాదించింది.

    అలాగే, పాల బిల్లులను ప్రతి నెలా 5వ, 20వ తేదీల్లో చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తోంది.

    ప్రస్తుతం డెయిరీకి ₹50 కోట్ల బకాయిలు ఉండటంతో, వాటిని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

    ఈ విషయమై నిర్వహించిన పాడి రైతుల సమావేశంలో మూడు కీలక ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి, ఇవి ప్రభుత్వ అనుమతికి పంపబడ్డాయి. అనుమతి లభించిన వెంటనే అమలు చేసే అవకాశముంది.

    వివరాలు 

    'విజయ'బ్రాండ్‌ను ఉపయోగించి కొన్ని డెయిరీలు విక్రయాలు

    గత ఏడాది నుండి దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి పెరగడం,కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు పాలు సరఫరా అవ్వడంతో మార్కెట్‌పై ప్రభావం పడింది.

    ప్రైవేట్,సహకార డెయిరీలు ఈ రాష్ట్రాల నుండి లీటరుకు ₹27 నుంచి ₹32 మధ్య పాలను సేకరించి, అధిక మార్కెటింగ్ కమిషన్లు అందిస్తూ తెలంగాణ మార్కెట్లో విక్రయాలను పెంచుకుంటున్నాయి.

    అదనంగా,'విజయ'బ్రాండ్‌ను అక్రమంగా ఉపయోగించి కొన్ని డెయిరీలు విక్రయాలు సాగిస్తున్నాయి.

    ఈ పరిణామాల వల్ల విజయ డెయిరీ అమ్మకాలు తగ్గాయి,తద్వారా ప్రతి నెలా సంస్థ దాదాపు ₹12కోట్లు నష్టపోతోంది.

    ఫలితంగా,రైతులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది.ఈనేపథ్యంలో,డెయిరీ యాజమాన్యం రైతు ప్రతినిధులతో భేటీ అయ్యి, ధరల సవరణ, బిల్లుల చెల్లింపులు, బకాయిల గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

    వివరాలు 

    ధరల మార్పు వివరాలు: 

    ప్రస్తుతం గేదె పాల సేకరణ ధర లీటరుకు ₹48 ఉండగా, దీనిని ₹51కి పెంచాలని నిర్ణయించింది.

    ఆవు పాల సేకరణ ధరను ప్రైవేట్, సహకార డెయిరీలతో పోల్చితే విజయ డెయిరీ లీటరుకు ₹8-9 అధికంగా చెల్లిస్తోంది.

    పాల ఉత్పత్తి, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈ ధరలను సవరించాలని నిర్ణయించినా, ఇతర ప్రైవేట్ డెయిరీల కంటే ఎక్కువే ఉంటుందని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    తెలంగాణ

    Telangana Tourism: టాప్‌-10లో హైదరాబాద్‌ చారిత్రక ప్రదేశాలు.. అత్యధిక దేశీయ పర్యాటకుల సందర్శనతో రికార్డు  పర్యాటకం
    Telangana: 22 శాతం పూర్తయిన ఖరీఫ్‌ సీఎంఆర్‌.. 7.90 లక్షల టన్నుల బియ్యం సిద్ధం భారతదేశం
    SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌.. పైకప్పు కూలినచోట 70% బురద, 30% నీళ్లు  భారతదేశం
    ATLAS: 'అట్లాస్‌' రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం.. బాధ్యులైన పదిమందికిపైగా అధికారులపై చర్యలకు ఆదేశం! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025