LOADING...
Andhra Pradesh: స్వచ్ఛ వాయు సర్వేక్షణలో విజయవాడకు 13వ ర్యాంకు 
స్వచ్ఛ వాయు సర్వేక్షణలో విజయవాడకు 13వ ర్యాంకు

Andhra Pradesh: స్వచ్ఛ వాయు సర్వేక్షణలో విజయవాడకు 13వ ర్యాంకు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన 'స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌ ర్యాంకులు-2025'లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా గాలి నాణ్యతను బట్టి నిర్వహించిన ఈ ర్యాంకింగ్స్‌లో, 10 లక్షల జనాభా పైగా ఉన్న నగరాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయవాడ 13వ స్థానాన్ని, విశాఖపట్టణం 17వ స్థానాన్ని సాధించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ 22వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.

వివరాలు 

అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు నగరం జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు పొందింది. ఈ ర్యాంకులను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించారు. ఇది జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (NCAP) కింద దేశంలోని 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు చేపట్టిన చర్యల ఫలితంగా జరిగింది.

వివరాలు 

తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాల ర్యాంకులు కేటగిరీల వారీగా: 

కేటగిరీ-1 (10 లక్షల పైగా జనాభా): విజయవాడ 13వ స్థానం విశాఖపట్నం 17వ స్థానం హైదరాబాద్ 22వ స్థానం కేటగిరీ-2 (3 నుంచి 10 లక్షల జనాభా): గుంటూరు 6వ స్థానం రాజమండ్రి 12వ స్థానం నెల్లూరు 18వ స్థానం కడప 23వ స్థానం కర్నూలు 29వ స్థానం అనంతపురం 35వ స్థానం కేటగిరీ-3 (3 లక్షల లోపు జనాభా): విజయనగరం 8వ స్థానం శ్రీకాకుళం 16వ స్థానం ఒంగోలు 21వ స్థానం చిత్తూరు 29వ స్థానం ఏలూరు 31వ స్థానం నల్గొండ (తెలంగాణ) 13వ స్థానం సంగారెడ్డి (తెలంగాణ) 17వ స్థానం

వివరాలు 

జాతీయ స్థాయిలో టాప్ నగరాలు: 

10 లక్షల జనాభా పైగా ఉన్న నగరాల్లో ఇండోర్ అగ్రస్థానాన్ని సంపాదించగా, జబల్‌పూర్ 2వ స్థానంలో నిలిచింది. ఆగ్రా, సూరత్ క్రమంగా 3వ స్థానంలో ఉన్నాయి. 3 నుంచి 10 లక్షల జనాభా విభాగంలో అమరావతి (మహారాష్ట్ర) 1వ స్థానం సాధించింది. 3 లక్షల జనాభా లోపు నగరాల్లో దేవాస్ (మధ్యప్రదేశ్) అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ నగరాలు గాలి నాణ్యత మెరుగుపరచేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఈ చర్యల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో ముందంజలో ఉన్నాయని పేర్కొంది.