NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ram Mohan Naidu: ఏపీలో మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
    తదుపరి వార్తా కథనం
    Ram Mohan Naidu: ఏపీలో మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
    ఏపీలో మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

    Ram Mohan Naidu: ఏపీలో మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 17, 2024
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయడమే తన ధ్యేయమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నాడు.

    ఇప్పటికే ఏడు ఉన్న ఏడు విమానాశ్రయాలతో కలిపి 14కు విస్తరిస్తామన్నారు.

    రాజమహేంద్రవరం, విజయవాడ, కడప విమానాశ్రయాల్లో టెర్నినల్ సామర్థ్యం పెంపు పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమీక్ష చేశామన్నారు.

    నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారని తెలిపారు. దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    Details

    విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

    ముఖ్యంగా ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు భూమిని గుర్తిస్తే శాఖ తరుఫున సహకారమందిస్తామన్నారు.

    మరోవైపు శ్రీకాకుళం, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు.

    ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామన్నారు.

    కొత్త ప్రాంతాల్లో భూమి, సాంకేతిక అంశాలను పరిశీలించి, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.

    Details

    పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు ప్రణాళికలు

    ఇక పుట్టపర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

    ప్రయివేటు విమానాశ్రయ నిర్వాహకులతో చర్చించి, పౌర విమానాయాన సంస్థగా మారిస్తే సాధారణ కార్యకలాపాలు సాగించవచ్చన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హాబ్‌గా చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచనని, లాజిస్టిక్ హబ్‌గా చేయడంలో విమానాశ్రయాల పాత్ర కీలకమన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    కేంద్రమంత్రి

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం రోడ్డు ప్రమాదం
    Andhrapradesh : వ్యాను ఢీ కొట్టిన లారీ.. బయటపడ్డ 7 కోట్ల నగదు  భారతదేశం
    Election cmapiagn -Completed: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం..144 సెక్షన్​ అమలు తెలంగాణ
    AP Violence: మూడు రోజులైనా ఎపిలో ఆగని హింసపై సీఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీ ఢిల్లీ రావాలని ఆదేశాలు ఎన్నికల సంఘం

    కేంద్రమంత్రి

    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025