NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Weather update: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక .. రానున్న రెండు రోజులు వడగాల్పులు
    తదుపరి వార్తా కథనం
    Weather update: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక .. రానున్న రెండు రోజులు వడగాల్పులు
    హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక .. రానున్న రెండు రోజులు వడగాల్పులు

    Weather update: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక .. రానున్న రెండు రోజులు వడగాల్పులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    08:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్ర వ్యాప్తంగా భానుడి సెగలు మరింత పెరగనుంది.

    వచ్చే మూడు రోజులపాటు సాధారణ ఉష్ణోగ్రతలకు పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

    రాబోయే రెండు రోజులు పగలు వేడిగాలులతో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఉందని, అలాగే రాత్రివేళల్లో కూడా గాలి ఉష్ణతా స్థాయిలోనే కొనసాగుతుందని తెలిపింది.

    బుధవారం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

    ఇది సాధారణ స్థాయిని మించిపోయి 3.6 డిగ్రీల మేరకు ఎక్కువగా ఉంది. అదిలాబాద్‌లో 44.3, మెదక్ జిల్లాలో 43.4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరించింది.

    వివరాలు 

    వడదెబ్బతో ఏడుగురు మృత్యువాత 

    ఎండలతీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

    నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్టా గ్రామానికి చెందిన గంగారాం(55),కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన కళ్లెం రమేష్‌ (54),ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రామనాథం వీధికి చెందిన శేషాచారి(80),పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లైన్ కాలనీకి చెందిన పుల్లూరి రమేష్‌కుమార్‌(37),వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన రవళి(35), హైదరాబాద్‌ చందానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వేస్టేషన్ ఆరో ప్లాట్‌ఫామ్ వద్ద నివసించే ఓ యాచకుడు (70),కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం (42)వడదెబ్బ కారణంగా మృతిచెందారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాతావరణ శాఖ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    వాతావరణ శాఖ

    Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణ
    Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు! తెలంగాణ
    Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణ
    Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు బంగాళాఖాతం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025