NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #NewsBytesExplainer: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏమిటి?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    #NewsBytesExplainer: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏమిటి?
    హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏమిటి?

    #NewsBytesExplainer: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏమిటి?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 02, 2025
    02:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యార్థుల నిరసనలు, ర్యాలీలు, అరెస్టులతో ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు అంటుండగా, ఆ భూములు ప్రభుత్వానివేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

    కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాలను టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

    యూనివర్సిటీ భవనాలను ఆనుకుని ఉండే ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    వివరాలు 

    వివాదం ఎందుకు ప్రారంభమైంది?

    హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2,324 ఎకరాల భూమిని కేటాయించింది.

    మొదట అబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో తరగతులు నిర్వహించగా, తరువాత గచ్చిబౌలికి తరలించారు.

    ఈ భూములపై వివాదం 2003లో ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రభుత్వం సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలను ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించాలని నిర్ణయించింది.

    అయితే 2006లో ప్రభుత్వం ఈ కేటాయింపును రద్దు చేసింది. దీని పై ఐఎంజీ అకాడమీ హైకోర్టులో కేసు వేసింది.

    2024 మార్చిలో హైకోర్టు ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా తీర్పు ఇచ్చింది. ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించినా, 2024 మేలో వారి పిటిషన్‌ను కొట్టివేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

    వివరాలు 

    ప్రభుత్వం, యూనివర్సిటీ వాదనలు

    టీజీఐఐసీ 2024 జూన్ 24న 400 ఎకరాలను ఐటీ, ఇతర ప్రాజెక్టుల కోసం అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

    ఈ భూములు ప్రభుత్వానివేనని, యూనివర్సిటీ భూములకు ఎలాంటి ముట్టడి జరగలేదని ప్రభుత్వం చెబుతోంది.

    అయితే, యూనివర్సిటీ ఈ వాదనను ఖండించింది. 2024 జులై 19న యూనివర్సిటీ రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులు భూముల సర్వే నిర్వహించారని ప్రభుత్వం చెబుతుండగా, యూనివర్సిటీ మాత్రం తాము ఎలాంటి అంగీకారం ఇవ్వలేదని ప్రకటించింది.

    పర్యావరణ పరిరక్షణ, బయోడైవర్సిటీకి నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

    వివరాలు 

    విద్యార్థుల నిరసనలు

    వివాదాస్పద భూమిలో హెలీప్యాడ్స్ ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

    విద్యార్థుల ప్రకారం, ఇప్పటికే అడవి కొంత భాగాన్ని చదును చేయగా, రాత్రిళ్లు కూడా పనులు జరుగుతున్నాయి.

    స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు డ్రోన్ చిత్రాలు విడుదల చేసి, అక్కడ పెద్ద ఎత్తున పొక్లెయిన్లు పనిచేస్తున్నట్లు తెలిపారు.

    ఈ నిర్మాణాల వల్ల జీవ వైవిధ్యం నాశనమవుతుందనే భయం వ్యక్తమవుతోంది.

    వివరాలు 

    ప్రభుత్వం స్పందన

    రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకారం,యూనివర్సిటీ రిజిస్ట్రార్, వీసీ తమ భూములతో సంబంధం లేదని చెప్పారంటూ అసెంబ్లీలో వెల్లడించారు.

    కానీ యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 2013లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కమిటీ ప్రకారం, యూనివర్సిటీకి 1,626 ఎకరాల భూమి మాత్రమే ఉందని తేలింది.

    యూనివర్సిటీ మిగిలిన భూములను తమ పేరుతో బదలాయించాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు.

    గచ్చిబౌలి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలకు యూనివర్సిటీ భూముల్లోనే స్థలాలు కేటాయించారని అంటున్నారు.

    వివరాలు 

    భవిష్యత్తు దిశగా

    విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరసనలు నిర్వహిస్తున్నారు.

    400 ఎకరాలు ఇచ్చిన తర్వాత, మరో 200 లేదా 300 ఎకరాలు ఇలా తీసుకుంటే, యూనివర్సిటీ భూములన్నీ పోతాయనే భయం ఉందని విద్యార్థులు చెబుతున్నారు.

    రాహుల్ గాంధీ స్పందించాలని, యూనివర్సిటీ భూములను కాపాడాలని విద్యార్థులు కోరుతున్నారు.

    ప్రస్తుతం వివాదం కొనసాగుతుండగా, దీనిపై మరింత స్పష్టత వచ్చే వరకు విద్యార్థుల నిరసనలు కొనసాగుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే! తెలంగాణ
    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
    UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం యూపీఐ
    DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తెలంగాణ

    Telangana Budget: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే? బడ్జెట్
    Revanth Reddy: హైకోర్టులో ఊరట.. సీఎం రేవంత్‌పై నమోదైన కేసు కొట్టివేత రేవంత్ రెడ్డి
    Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. వికారాబాద్‌-కృష్ణాల మధ్య ఏర్పాటు భారతదేశం
    SSC Public Exams 2025: తెలంగాణాలో రేపట్నుంచి పదో క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025