NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే.. 
    తదుపరి వార్తా కథనం
    Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే.. 

    Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే.. 

    వ్రాసిన వారు Stalin
    Sep 09, 2023
    12:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరువురు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించారు.

    మోదీ- బైడెన్ చర్చల తరువాత సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంలో తమ నిబద్ధతను ఆ ప్రకటనలో మరోసారి పునరుద్ఘాటించారు.

    ఆ ప్రకటనలో ఏముందో ఒకసారి తెలుసుకుందాం. రెండు నెలల క్రితం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఇరువురు దేశాధినేతలు ప్రకటించారు.

    జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించడంపై బైడెన్ ప్రశంసించారు.

    మోదీ

    యూఎన్ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బైడెన్ మద్దతు 

    2024లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ, వాణిజ్య కనెక్టివిటీ, సముద్ర రవాణాపై ఓషన్స్ ఇనిషియేటివ్ ప్రోత్సహించడంలో క్వాడ్ ప్రాముఖ్యతను మోదీ, బైడన్ గుర్తించారు.

    యూఎన్ భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బైడెన్ తన మద్దతును పునరుద్ఘాటించారు. 2028-29లో యూఎన్ఎసీ నాన్-పర్మనెంట్ సీటుకు భారతదేశ అభ్యర్థిత్వాన్నిబైడెన్ స్వాగతించారు.

    భారత్- అమరికా మధ్య సాంకేతిక భాగస్వామ్యంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ క్రమంలో ఇరు దేశాలు ఒప్పదం చేసుకున్న భారత్-యూఎస్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(ఐసీఈటీ)ని ప్రశ్నించారు.

    అమెరికా

    భారత అంతరిక్ష పరిశోధనలపై బైడన్ ప్రశంసలు 

    చంద్రయాన్-3 విజయవంతం నేపథ్యంలో అంతరిక్ష పరిశోధనలో భారత్ సాధించిన విజయాలపై బైడెన్ ప్రశంసల వర్షం కురింపించారు.

    అంతరిక్ష పరిశోధన, గ్రహాల రక్షణలో ఉమ్మడి ప్రయత్నాల కోసం చర్చలు జరుగుతున్నట్లు ఇద్దరు నేతలు చెప్పారు.

    భారతదేశంలోని మైక్రోచిప్ టెక్నాలజీ ఇంక్., అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్ నుంచి మిలియన్ డాలర్ల పెట్టుబడులను బైడెన్-మోదీ స్వాగతించారు. అలాగే బలమైన గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను సృష్టించేందుకు ఇరువురు నేతలు పరస్పరం మద్దతును తెలుపుకున్నారు.

    భారత్ 6జీ అలయన్స్, నెక్స్ట్ జీ అలయన్స్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా సురక్షితమైన కమ్యూనికేషన్‌, డిజిటల్ ఒప్పందాలపై ఆసక్తిని కనబర్చారు.

    అమెరికా

    ఏఐ, స్పేస్‌, రక్షణ రంగంలో మరింత సహకారం

    ఏఐ, స్పేస్‌తో సహా అభివృద్ధి చెందుతున్న డొమైన్‌లలో సహకారాన్ని మోదీ-బైడెన్ అంగీకరించారు. అలాగే భారత్-యూఎస్ మధ్య రక్షణ రంగంలో సాంకేతిక సహకారం గణనీయమైన అభివృద్ధిని సాధించింది.

    తాజాగా జీఈ ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మధ్య ఉత్పత్తి, సాంకేతిక బదిలీతో ఈ సహకారం తయారీ రంగానికి కూడా విస్తరించింది.

    స్పేస్, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న డొమైన్‌లతో సహా రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలపర్చుకోవాలని బైడెన్, మోదీ ప్రతిజ్ఞ చేశారు. అణుశక్తి ఆవశ్యకతపై మోదీ, బైడెన్ చర్చించారు.

    వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణియించారు. సురక్షితమైన ఇంధన సహకారంపై ఇరువు నేతలు ఒక అవగాహనకు వచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    జో బైడెన్
    అమెరికా
    భారతదేశం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నరేంద్ర మోదీ

    Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం స్వాతంత్య్ర దినోత్సవం
    సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో 6G.. సూపర్ స్పీడ్ సాంకేతికతపై టాస్క్‌ఫోర్స్‌ ప్రధాన మంత్రి
    PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు 5 వరాలు ఎన్నికలు

    జో బైడెన్

    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా రష్యా

    అమెరికా

    ఉత్తర కొరియా టాప్ జనరల్ తొలగింపు.. యుద్ధానికి సిద్ధం కావాలని కిమ్ జోంగ్ పిలుపు ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    అమెరికా హవాయి ద్వీపంలో కారుచిచ్చు .. సముద్రంలోకి దూకేస్తున్న ప్రజలు, 36 మంది మృత్యువాత జో బైడెన్
    అమెరికా: లహైనా నగరాన్నికమ్మేసిన కార్చిచ్చు: 67కు చేరిన మృతుల సంఖ్య  ప్రపంచం
    100ఏళ్లలో చూడని విపత్తు.. ఆహుతవుతున్న లహైనా నగరం: 89కు చేరిన మృతుల సంఖ్య  అగ్నిప్రమాదం

    భారతదేశం

    మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ గెలుచుకున్న శ్వేతా శారద: ఆమె గురించి మీకు తెలియని విషయాలు  సినిమా
    పాకిస్థాన్‌లో భారత డిప్యూటీ హైకమిషన్‌గా గీతిక శ్రీవాస్తవ నియామకం  పాకిస్థాన్
    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025