NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jyoti Malhotra: హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jyoti Malhotra: హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్
    హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్

    Jyoti Malhotra: హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 28, 2025
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన ఆరోపణలపై అరెస్టయ్యింది.

    పోలీసుల కస్టడీ అనంతరం ఆమెను హర్యానాలోని హిసార్ కేంద్ర కారాగారానికి తరలించారు.

    బుధవారం రోజున జ్యోతి మల్హోత్రాను ఆమె తండ్రి హరీష్ జైలులో కలిసి మాట్లాడారు.

    తండ్రి కుమార్తెను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఆయన తెలిపిన ప్రకారం, జ్యోతి తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించలేదని, తాను ఏ తప్పూ చేయలేదని తల్లడిల్లుతూ చెప్పిందని వెల్లడించారు.

    అంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు హరీష్, తన కుమార్తె పాకిస్థాన్ వెళ్లినది కేవలం వీడియోలు తీసేందుకు మాత్రమేనని చెప్పారు.

    వివరాలు 

    హిసార్ జైలుకు జ్యోతి 

    భారతదేశ సార్వభౌమాధికారం,ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించే చర్యలు చేసిన ఆరోపణలపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద కేసు నమోదు చేసిన పోలీసులు,మే 17న ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

    మొదట ఆమెను ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచగా,తరువాత మే 22న మరో నాలుగు రోజులు పొడిగించారు.

    అనంతరం మే 26న ఆమెను మళ్లీ కోర్టు ముందు హాజరుపరచి, హిసార్ జైలుకు తరలించారు.

    పోలీసు సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ వెల్లడించిన ప్రకారం,మొత్తం తొమ్మిది రోజుల పాటు జ్యోతిని విచారించామని చెప్పారు.

    ఆమె ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఏవైనా స్పష్టమైన ఆధారాలు లభించలేదని వెల్లడించారు.

    అలాగే,వ్యూహాత్మకమైన లేదా సైనిక సంబంధిత సమాచారం洨 పంపినట్టు కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదని పేర్కొన్నారు.

    వివరాలు 

     జ్యోతి నాలుగు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి విశ్లేషణ 

    అయితే పాకిస్థాన్‌కు చెందిన నిఘా వ్యక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని, ఈ సంబంధాలను ధృవీకరించామని చెప్పారు.

    ఈ దర్యాప్తులో కేంద్ర అన్వేషణ సంస్థలు కూడా పాల్గొన్నాయని తెలిపారు.

    జ్యోతి మల్హోత్రాకు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి విశ్లేషణ చేస్తున్నామని పేర్కొన్నారు.

    అంతేగాక, ఆమె ఇస్లాం మతంలోకి మారినట్లు లేదా పాకిస్థాన్‌కు చెందిన నిఘా వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని స్పష్టం చేశారు.

    గత ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

    వివరాలు 

     వీడియోలలో పాకిస్థాన్ అధికారులు సన్నిహితంగా జ్యోతి 

    ఈ ఘటనలో జ్యోతి మల్హోత్రా పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు, ఆమె ఇప్పటికే మూడు సార్లు పాకిస్థాన్‌కు వెళ్లి వచ్చింది.

    అదేవిధంగా, అనేకసార్లు కాశ్మీర్ ప్రాంతాలను సందర్శించిన దాఖలాలు ఉన్నాయి.

    పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కూడా ఆమె అక్కడ వీడియోలు తీసినట్లు గుర్తించారు.

    ఈ వీడియోల సమాచారాన్ని ఆమె పాకిస్థాన్‌కు చెందిన నిఘా వ్యక్తులతో పంచుకుని ఉండవచ్చన్న అనుమానంతో ఆమెను అరెస్ట్ చేశారు.

    జ్యోతికి సంబంధించిన కొన్ని వీడియోలలో పాకిస్థాన్ అధికారులు ఆమెతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కనిపించినట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జ్యోతి మల్హోత్రా

    తాజా

    Jyoti Malhotra: హర్యానా జైల్లో జ్యోతి మల్హోత్రాను కలిసిన తండ్రి హరీష్ జ్యోతి మల్హోత్రా
    Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు ఇరాన్
    OG: ఓజీ సెట్స్‌లో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ వైరల్  పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: ఒక రూపాయితో కోటీశ్వరుడవ్వడం సాధ్యమేనా..?.. ఫాంటసీ క్రికెట్ యాప్స్ మాయలో పడుతున్న భారత యువత బెట్టింగ్‌ యాప్స్‌

    జ్యోతి మల్హోత్రా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   భారతదేశం
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ భారతదేశం
    Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..  భారతదేశం
    Jyoti Malhotra Case: యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు.. రంగంలోకి యాంటి టెర్రర్ విభాగం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025