NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తర్‌ప్రదేశ్‌: కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య
    తదుపరి వార్తా కథనం
    ఉత్తర్‌ప్రదేశ్‌: కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య
    కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

    ఉత్తర్‌ప్రదేశ్‌: కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 27, 2023
    01:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను, భార్య ఘోరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. బదౌన్‌కు చెందిన తేజేంద్ర సింగ్‌, భార్య మిథిలేశ్‌ దేవికి నలుగురు సంతానం.

    43ఏళ్ల తేజేంద్ర సింగ్‌ ఆగస్ట్ 14న అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను విచారించారు. తన భర్తను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా భార్య సైతం వాంగ్మూలం ఇచ్చారు.

    ఈ క్రమంలోనే మిథిలేశ్‌ దేవి సమాధానాలు చెప్పడంలో తడబడినట్లు, పొంతని లేని విషయాలు చెప్పారని పోలీసులు గుర్తించారు. అనుమానంతో ఆమెను కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె నేరం ఒప్పుకున్నారు.

    DETAILS

    కోడల్ని లైంగికంగా సహకరించేందుకు ఒప్పించమని బలవంతం పెట్టేవాడు : మిథిలేశ్‌ దేవి

    తన భర్త తరచుగా తనను కొట్టేవాడని, కోడల్ని లైంగికంగా సహకరించేందుకు ఒప్పించమని వేధించేవాడని నిందితురాలు మిథిలేశ్‌ దేవి చెప్పారు. భర్త విపరీత ప్రవర్తనతో విసిగిపోయి, అతడ్ని వదిలించుకునేందుకు అవకాశాల కోసం ఎదురుచూశానని తెలిపారు.

    ఈ క్రమంలోనే ఆగస్ట్ 14న విపరీతమైన మద్యం తాగి వచ్చి గొడవ చేశాడన్నారు. ఇదే సమయంలో ఇంటి బయట నిద్రిస్తున్నాడని, దీంతో కొడవలితో గొంతు కోసి హత్య చేసినట్లు మిథిలేశ్‌ దేవి వివరించారు.

    అయితే తన కోడల్ని లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకే భర్తను చంపాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    హత్య

    తాజా

    AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం  హరిహర వీరమల్లు
    Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  పూజా ఖేద్కర్‌
    Kumki Elephants: ఏపీకి ఐదు కుంకీ ఏనుగులు.. వాటి పేర్లు ఇవే.. పవన్ కళ్యాణ్
    Dilraju : సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది! దిల్ రాజు

    ఉత్తర్‌ప్రదేశ్

    భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు ఇవే  రైలు ప్రమాదం
    గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు  హత్య
    యూపీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి దిల్లీ పోలీసులు; 12మంది వాంగ్మూలాల నమోదు  రెజ్లింగ్
    లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు  హత్య

    హత్య

    భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు ఉత్తర్‌ప్రదేశ్
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ వైఎస్సార్ కడప
    అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు  ఉత్తర్‌ప్రదేశ్
    హర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025