NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య
    రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య
    భారతదేశం

    రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య

    వ్రాసిన వారు Naveen Stalin
    March 30, 2023 | 10:31 am 0 నిమి చదవండి
    రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య
    రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య

    భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధ రోహత్గీ దిల్లీలోనే ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. బంగ్లా ఖరీదు అక్షరాల రూ.160 కోట్లు అని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. దిల్లీలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన గోల్ఫ్ లింక్స్‌లో 2,100 చదరపు గజాలతో ఈ విలాసవంతమైన బంగ్లా ఉంది. ఫిబ్రవరి 23న బంగ్లా రిజిస్ట్రేషన్ పూర్తయిందని, దీన్ని కొనుగోలు చేసినందుకే ముకుల్ రోహత్గీ కుటుంబం కేవలం స్టాంప్ డ్యూటీనే రూ.6.4 కోట్ల చెల్లించిందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. దిల్లీలోని గోల్ఫ్ లింక్స్ ప్రదేశంలో పరిమితంగా కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతుంటాయి. దీన్ని చాలా లగ్జరీ ప్రదేశంగా భావిస్తుంటారు. అందుకే ఈ ప్రదేశంలో కొనుగోళ్లు, అమ్మకాలు రూ.100కోట్లకు పైనే జరుగుతుంటాయి.

    బంగ్లా కొనుగోలుపై స్పందించేందుకు నిరాకరించిన ముకుల్ రోహత్గీ

    రోహత్గీ దంపతులు ఈ ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేయడం ద్వారా, దిల్లీలోని బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్ల సరసన చేరినట్లు అవుతుందని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. గోల్ఫ్ లింక్స్‌లో బంగ్లా కొనుగోలుపై రోహత్గీని సంప్రదించగా, ఆయన దీనిపై మాట్లాడేందుకు నిరాకరించిటన్లు ఎకనామిక్ టైమ్స్ చెప్పింది. గత ఏడాది, భారత మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియం కూడా దిల్లీలోని లుటియన్స్ సుందర్ నగర్‌లో 866 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.85 కోట్ల రూపాయలతో విశాలమైన బంగ్లాను కొనుగోలు చేశారు. నాన్ కార్పొరేట్ వ్యక్తి ఇంత మొత్తం ఎలా కొన్నారా అని ఆ సమయంలోనే అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు రోహత్గీ దానికి రెండు రెట్ల మొత్తం చెల్లించి బంగ్లాను కొనుగోలు చేయడం మరింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    సుప్రీంకోర్టు
    భారతదేశం
    తాజా వార్తలు

    దిల్లీ

    దిల్లీ రోడ్లపై కనిపించిన అమృత్ పాల్ సింగ్; తలపాగా లేకుండా కళ్లద్దాలు, డెనిమ్ జాకెట్‌తో దర్శనం పంజాబ్
    'ఫోన్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం'; కవితకు లేఖ రాసిన ఈడీ జాయింట్ డైరెక్టర్ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ కల్వకుంట్ల కవిత

    సుప్రీంకోర్టు

    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు కడప
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు సీబీఐ

    భారతదేశం

    మార్చి 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్ ఉద్యోగుల తొలగింపు
    ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు ప్రకటన
    ఇకపై ఖరీదైనవిగా మారనున్న ఆన్‌లైన్ చెల్లింపులు వ్యాపారం

    తాజా వార్తలు

    53ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్; చిలీలో మొదటి కేసు గుర్తింపు చిలీ
    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్
    మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం రాజస్థాన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023