NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ 
    తదుపరి వార్తా కథనం
    Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ 
    దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ

    Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 22, 2024
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్'లో జరుగుతున్న అరాచకాలపై గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ చేతి వేలు కోసుకొని నిరసన తెలిపింది.

    ఆమె దేశ రాజధాని దిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌లను కలిసేందుకు ప్రయత్నించారు.

    వారు కలవకపోవడంతో..ఇండియా గేట్ వద్ద బొటన వేలు కోసుకుంది. జగన్ హయాంలో ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో వేలు కోసుకున్నట్లు తెలిపింది.

    బాధితురాలు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

    Details 

    వీడియోలోని వివరాల ప్రకారం 

    ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కోపూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండల అధ్యక్షురాలు.

    పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు తెరలేపిందని ఆమె ఆరోపించింది. మహిళలు గంజాయి అమ్మేలా చేయడం, తప్పుడు పత్రాలతో ఆస్తులు, భూములు అమ్ముకోవడం వంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని ఆమె వాపోయారు.

    ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులు, కత్తులు, రాడ్లతో బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.

    మహిళలపై అనేక అరాచకాలు జరుగుతున్నాయని, వీటన్నింటినీ రాష్ట్రం,దేశం,ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకే ఢిల్లీకి వచ్చానన్నారు.

    రాష్ట్రపతి,సీజేఐ,ప్రధానిని కలవడం కుదరకపోవడంతో వారి కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేసి, వేలు కోసుకుని నిరసన తెలుపుతున్నట్లు ఆమె తెలిపారు.

    తాను చేసిన పనికి అందరూ క్షమించాలని కోపూరు లక్ష్మి వీడియోలో కోరింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అవుతున్న వీడియో ఇదే..

    ఇండియా గేట్ వద్ద చేతి వేలు కోసుకున్న మహిళ
    ఏపీ మాజీ హోం మంత్రి అనుచరుల అక్రమాలపై ఢిల్లీలో నిరసన

    ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై చేతి వేలు కోసుకొని నిరసన తెలిపిన గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి. మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలపై ఏకరువు. గంజాయి, ఫోర్జరీతో భూకబ్జాలు… pic.twitter.com/i5nPVL36YQ

    — BIG TV Breaking News (@bigtvtelugu) April 22, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు జిల్లా
    ఆంధ్రప్రదేశ్
    దిల్లీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    గుంటూరు జిల్లా

    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  ఆంధ్రప్రదేశ్
    గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు విద్యార్థులు
    టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    ఆంధ్రప్రదేశ్

    AP Congress: పంచముఖవ్యూహాలు,ఆరు సూత్రాలతో ఎన్నికలకు వెళతాం: ఏపీ కాంగ్రెస్ కాంగ్రెస్
    AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ @ రూ.2.85లక్షల కోట్లు  బడ్జెట్ 2024
    Kodikathi Sreenu: కోడి కత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్  హైకోర్టు
    Inner Ring Road Case: చంద్రబాబు,లోకేష్‌లపై ఏపీసీఐడీ చార్జిషీట్ దాఖలు  భారతదేశం

    దిల్లీ

    1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్  తాజా వార్తలు
    Drugs: రూ. 2,500 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌‌ను పట్టివేత  తాజా వార్తలు
    Delhi : దిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో మునిగి నలుగురు విద్యార్థులు మృతి  భారతదేశం
    Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి? నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025