సోనియా,రాహుల్ తో వైఎస్ షర్మిల కీలక భేటీ.. కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్న షర్మిల
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీలతో షర్మిల భేటీ అయ్యారు. తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినట్లు షర్మిల వెల్లడించారు.తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్సార్ బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే విషయాన్ని మరోసాారి ప్రస్తావించారు. దిల్లీ నుంచి ఇవాళ హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్నట్లు చెప్పారు. మరోవైపు దిల్లీలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు షర్మిల సమాధానం దాటవేశారు. ఈ క్రమంలోనే తర్వాత మాట్లాడదామని,తనను వెళ్లనివ్వండని కోరుతూ అక్కడి నుంచి నిష్క్రమించారు.
దిల్లీలో వైఎసాఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
In a major political development, #YSRTP chief #YSSharmila met #SoniaGandhi and #RahulGandhi over breakfast in Delhi and discussed the merger of her party into #Congress. Sharmila is the daughter of Late CM #YSR and the sister of #AndhraPradesh CM #YSJagan.#TelanganaElection2023 pic.twitter.com/Ca1VSypoFD— Ashish (@KP_Aashish) August 31, 2023