NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / International Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    International Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా? 
    'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా?

    International Yoga Day 2023: 'యోగా డే'ను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసా? 

    వ్రాసిన వారు Stalin
    Jun 21, 2023
    04:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

    యోగ అనేది శతాబ్దాలుగా భారతీయ సంస్కృతి, దేశ ప్రజల జీవన విధానంలో భాగమైంది.

    ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగా ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందనే చెప్పాలి.

    2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది. మొదటి ఏడాది నుంచి యోగా డే అత్యంత ప్రజాదరణ పొందింది.

    2014 సెప్టెంబరు 27న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను మొదటిసారిగా ప్రవేశపెట్టారు.

    డిసెంబర్ 11, 2014న ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.

    యోగ

    యోగా చరిత్ర ఇదే

    యోగా చాలా పురాతనమైనది. దాదాపు 5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. 'యోగా' అనే పదం సంస్కృత పదం 'యుజ్' నుంచి ఉద్భవించింది. దీని అర్థం కలయిక.

    భౌతిక భంగిమలు, శ్వాస నియంత్రణ, ధ్యానం, నైతిక సూత్రాల ద్వారా మనస్సు, శరీరం, ఆత్మను సమన్వయం చేసే తత్వశాస్త్రాన్ని యోగా కలిగి ఉంటుంది.

    యోగా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సామూహిక యోగా సెషన్‌లు, మెడిటేషన్ వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలతో సహా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

    యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తారు. ఏడాదికేడాది యోగాకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. యోగాపై అనేక మంది ఆసక్తిని కనబరుస్తున్నారు.

    యోగ

    ఈ ఏడాది థీమ్ 'వసుధైవ కుటుంబానికి యోగా'

    శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతను సాధించడానికి యోగా అనేది ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.

    నిరంతరం యోగా చేయడం వల్ల ఆరోగ్యం చాలా మెరగవుతుంది. రుగ్మతలు దరిచేరవు. అంతేకాకుండా శరీరంపై పూర్తి స్థాయిలో నియంత్రణ వస్తుంది. యోగా అభ్యాసకులు ఎంతటి ఒత్తిడినైనా సులువుగా జయించవచ్చు.

    అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 థీమ్‌ను ప్రధాని మోదీ 'వసుధైవ కుటుంబానికి యోగా' అని ప్రకటించారు.

    ఈ ఏడాది 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వేడుకలను ప్రధాని మోదీ ప్రతిష్టాత్మంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహిచడం చాలా ప్రత్యేకమనే చెప్పాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగ
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ
    ఐక్యరాజ్య సమితి

    తాజా

    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ

    యోగ

    యోగసనాలతో ముడతలు దూరం చలికాలం
    నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి వ్యాయామం
    ఐబీఎస్ తో ఇబ్బందిపడేవారు ఈ యోగాసనాలతో ఉపశమనం పొందండి లైఫ్-స్టైల్
    వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బు నరాలు తగ్గిపోవాలంటే చేయాల్సిన యోగాసనాలు వ్యాయామం

    ప్రధాన మంత్రి

    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ  నరేంద్ర మోదీ
    పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరం.. 19 పార్టీలు ఉమ్మడి ప్రకటన రాష్ట్రపతి
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  అమిత్ షా

    నరేంద్ర మోదీ

    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు సుప్రీంకోర్టు
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల ఆర్థిక శాఖ మంత్రి
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్

    ఐక్యరాజ్య సమితి

    భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ కైలాసం
    పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్
    ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే' ప్రపంచం
    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025