Page Loader
deepseek: భారత డేటాకు ముప్పు? చైనా డీప్‌సీక్‌పై కేంద్రం అలర్ట్‌!
భారత డేటాకు ముప్పు? చైనా డీప్‌సీక్‌పై కేంద్రం అలర్ట్‌!

deepseek: భారత డేటాకు ముప్పు? చైనా డీప్‌సీక్‌పై కేంద్రం అలర్ట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్‌ 'డీప్‌సీక్‌'పై భారత ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఈ టూల్‌ భారతీయ కంప్యూటర్లలో డేటా గోప్యతకు ముప్పుగా మారుతోందన్న ఆందోళనలు పెరుగుతుండటంతో, కేంద్రం దీనిపై తగిన హెచ్చరికలు, సలహాలు జారీ చేయనుంది. త్వరలోనే డీప్‌సీక్‌ వంటి ఏఐ టూల్స్‌ వినియోగంపై అధికారిక అడ్వైజరీ విడుదల చేయనున్నట్లు సమాచారం.

Details

డీప్‌సీక్‌పై సమగ్ర దర్యాప్తు

భారత సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ డీప్‌సీక్‌ ద్వారా సున్నితమైన యూజర్‌ డేటా సేకరణపై విచారణ చేపట్టింది. ఈ ఏఐ టూల్‌ యూజర్ ప్రాంప్ట్స్, డివైస్‌ సమాచారం, యాప్‌ ఇంటరాక్షన్స్, కీ స్ట్రోక్స్‌ తదితర వివరాలను సేకరిస్తోందని అధికారులు గుర్తించారు. భద్రతా చర్యలను వేగవంతం చేస్తూ, వ్యక్తిగత గోప్యత, జాతీయ భద్రత పరిరక్షణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

Details

ప్రపంచవ్యాప్తంగా నిషేధం

భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇటలీ, దక్షిణ కొరియా, తైవాన్‌ వంటి దేశాలు డీప్‌సీక్‌ వినియోగాన్ని నిషేధించాయి. ప్రైవసీ, మాల్‌వేర్‌ సమస్యల కారణంగా ఆస్ట్రేలియా నిషేధం విధించింది. దేశ భద్రతకు ముప్పుగా తైవాన్‌ పేర్కొంది. డీప్‌సీక్‌ వినియోగదారుల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ కార్యకలాపాలను కూడా ట్రాక్‌ చేస్తోందని CERT-In పరిశోధనలో తేలింది. చాట్‌జీపీటీ, గూగుల్‌ జెమినీ వంటి పోటీ ఏఐ టూల్స్‌ వినియోగాన్ని నిరంతరం గమనిస్తోంది. సేకరించిన డేటా చైనా ప్రభుత్వానికి చేరదని స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డీప్‌సీక్‌కు సరైన జవాబుదారీతనం లేకపోవడం, నిఘా లేదా గూఢచర్యం కోసం ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Details

ఏఐ టూల్స్ నిషేధిస్తూ ఉత్తర్వులు

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ అధికారులకు చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌ వంటి ఏఐ టూల్స్‌ వినియోగం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుసంధానంగా ఐటీ మంత్రిత్వ శాఖ కూడా డీప్‌సీక్‌పై నియంత్రణ విధించేందుకు సిద్ధమవుతోంది. భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని, ఏఐ టూల్స్‌ వినియోగంపై మరింత కఠినమైన నియంత్రణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.