NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / X : సెన్సార్‌షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    X : సెన్సార్‌షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా 
    సెన్సార్‌షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా

    X : సెన్సార్‌షిప్,ఐటీ చట్ట ఉల్లంఘన.. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    05:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ (X) సోషల్ మీడియా సంస్థ భారత ప్రభుత్వంపై కోర్టులో కేసు దాఖలు చేసింది.

    ఈ దావాను కర్ణాటక హైకోర్టులో ఫైల్ చేసింది. భారత ప్రభుత్వం అక్రమంగా కంటెంట్ నియంత్రణ చేపడుతోందని, సెన్సార్‌షిప్‌కు పాల్పడుతోందని ఎక్స్ సంస్థ ఆరోపించింది.

    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని ఉపయోగించే విధానంపై ఎక్స్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

    ఎక్స్ సంస్థ ప్రకారం, భారత ప్రభుత్వం ఐటీ చట్టంలోని 79(3)(బీ) సెక్షన్‌ను అక్రమంగా ఉపయోగిస్తున్నదని పేర్కొంది.

    ఈ సెక్షన్ అమలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నట్లు సంస్థ తన దావాలో తెలిపింది.

    అంతేకాకుండా, ఈ సెక్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో భావస్వేచ్ఛను అడ్డుకుంటున్నట్లు కూడా ఆరోపించింది.

    వివరాలు 

    సెక్షన్ 69ఏను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం

    ప్రభుత్వం 79(3)(బీ)సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తోందని ఎక్స్ సంస్థ స్పష్టం చేసింది.

    దీనిద్వారా సహయోగ్ పోర్టల్‌ను సమాంతరంగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

    సెక్షన్ 69ఏను ఉల్లంఘిస్తూ కంటెంట్ బ్లాకింగ్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఎక్స్ సంస్థ ఆరోపించింది.

    2015లో శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం ఉల్లంఘిస్తోందని ఎక్స్ పేర్కొంది.

    వివరాలు 

     కంటెంట్ బ్లాక్ చేయాలంటే.. 69ఏ సెక్షన్ 

    ఎక్స్ ప్రకారం, కంటెంట్ బ్లాక్ చేయాలంటే అది న్యాయ ప్రక్రియ ద్వారా జరగాలి లేదా 69ఏ సెక్షన్ ప్రకారం ముందుకు సాగాలని సంస్థ పేర్కొంది.

    సెక్షన్ 79 ప్రకారం, అక్రమ కంటెంట్ ఉందని నిర్ధారిస్తే, కోర్టు లేదా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ సంస్థలు దానిని తొలగించాల్సి ఉంటుంది.

    36 గంటల్లో కంటెంట్ తొలగించని పక్షంలో, ఆ సంస్థ ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ప్రకారం న్యాయ విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని ఎక్స్ తన పిటీషన్‌లో వివరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎక్స్

    తాజా

    Omar Abdullah: అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. పరిస్థితిని సమీక్షించనున్న సీఎం  ఒమర్ అబ్దుల్లా
    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! భారతదేశం
    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    ఎక్స్

    జుకర్ బర్గ్ తో ఫైటింగ్ చేస్తానంటున్న ఎలాన్ మస్క్: కౌంటర్ వేసిన థ్రెడ్స్ అధినేత  ఎలాన్ మస్క్
    ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే?  ట్విట్టర్
    Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్‌కు గుడ్ బై చెప్పిన మస్క్ ఎలాన్ మస్క్
    ఎక్స్ లో కీలక మార్పు: ఇకపై రిప్లయ్ ఇచ్చే అవకాశమూ పోయినట్టే!  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025