NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
    జూన్‌ 8న అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా

    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    08:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర తేది ఖరారైంది.

    యాక్సియం స్పేస్‌ సంస్థ చేపట్టిన యాక్సియం-4 (AX-4) మిషన్‌లో భాగంగా ఆయన ఈ ఏడాది జూన్ 8న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు పయనించనున్నారు.

    ఈ విషయాన్ని యాక్సియం స్పేస్‌, నాసా కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ప్రకటించాయి.

    మొదటగా ఈ మిషన్‌ను మే 29న నిర్వహించేందుకు షెడ్యూల్‌ చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో ప్రయోగాన్ని జూన్‌లోకి ముందుకు జరిపారు.

    వివరాలు 

     అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ శాస్త్రీయ పరిశోధనలు 

    భారతీయ కాలమానం ప్రకారం జూన్ 8వ తేదీ సాయంత్రం 6.41 గంటలకు (అమెరికా తూర్పు కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు) అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన డ్రాగన్‌ అంతరిక్ష నౌకలో శుభాంశు శుక్లా రోదసిలోకి ప్రయాణం ప్రారంభించనున్నారు.

    ఈ అంతరిక్ష యాత్రలో ఆయనతో పాటు అమెరికా వ్యక్తి పెగ్గీ విట్సన్‌, పోలండ్‌కు చెందిన స్లావోస్జ్‌ ఉజ్నాన్స్కీ, హంగరీకి చెందిన టిబర్‌ కపు కూడా పాల్గొంటున్నారు.

    వీరందరూ రెండు వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటూ వివిధ శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించనున్నారు.

    ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మొదలవుతోంది.

    వివరాలు 

     1984లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన  భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ 

    చివరిసారిగా 1984లో భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ రష్యా వ్యోమనౌకలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన విషయం విదితమే.

    ఇప్పుడు శుభాంశు శుక్లా ఈ ప్రయాణం చేయనుండగా,ఇది నాసా,భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో సంయుక్తంగా నిర్వహిస్తున్న మిషన్ కావడం విశేషం.

    ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా మొత్తం ఏడుగురు శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొననున్నారు.ఆయన చేసే పరిశోధనలలో అంతరిక్షంలో పంటల పెంపకం, అలాగే నీటి ఎలుగుబంటులుగా పిలిచే టార్డిగ్రేడ్‌లపై అధ్యయనం ముఖ్యమైనవి. భారతీయ ఆహారానికి సంబంధించిన పంటలపై ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది.

    ఇందులో మెంతి, పెసల మొలకలపై పరిశీలనలు చేయడం ఉంటుంది.

    ఈ మొలకలను భూమికి తీసుకురావడంతో పాటు, భూమి మీద అవి ఎలా అభివృద్ధి చెందుతాయన్నదానిపై పరిశీలనలు జరపనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాసా

    తాజా

    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం

    నాసా

    Nasa: యూరోపా క్లిప్పర్ మిషన్‌ను ప్రారంభించిన నాసా.. మంచుతో నిండిన చంద్రుని అధ్యయనం  టెక్నాలజీ
    solar maximum period: అధికారికంగా 'సౌర గరిష్ట కాలం'లోకి ప్రవేశించిన సూర్యుడు  టెక్నాలజీ
    NASA: ఐఎస్ఎస్‌లో నిలిచిపోయిన NASA-SpaceX Crew-8 మిషన్‌.. కారణమిదే!  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    NISAR Mission: NISAR మిషన్ కోసం ISRO రిఫ్లెక్టర్‌, భారతదేశానికి పంపిన నాసా ఇస్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025