NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / అతిపెద్ద 5G నెట్వర్క్ కలిగిన టాప్-3 దేశాల సరసన భారత్.. నోకియా సీఈఓ కీలక ప్రశంసలు 
    తదుపరి వార్తా కథనం
    అతిపెద్ద 5G నెట్వర్క్ కలిగిన టాప్-3 దేశాల సరసన భారత్.. నోకియా సీఈఓ కీలక ప్రశంసలు 
    అతిపెద్ద 5G నెట్వర్క్ కలిగిన టాప్-3 దేశాల సరసన భారత్

    అతిపెద్ద 5G నెట్వర్క్ కలిగిన టాప్-3 దేశాల సరసన భారత్.. నోకియా సీఈఓ కీలక ప్రశంసలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 06, 2023
    01:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని ఎలక్ట్రానికి సిటీ, ఐటీ మహానగరం బెంగుళూరులో నోకియా తన 6G రీసెర్చ్ ల్యాబ్‌ను ప్రారంభించింది.

    ఫిన్ లాండ్ టెలికాం కంపెనీ Nokia బెంగళూరులో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో 6G ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.

    ఈ క్రమంలోనే భారత్ 5G విస్తరణపై నోకియా ప్రెసిడెంట్, సీఈఓ పెకా లుండ్‌బెర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    భారత్ 5Gని ఇష్టపడుతోందని, ప్రపంచంలోనే 5G యూజర్ బేస్ కలిగిన టాప్ 3 దేశాల్లో భారతదేశం ఒకటని ఆయన ప్రశంసించారు.

    భారత్ 5G కనెక్టివిటీ విస్తరణ చాలా ఆకట్టుకుందన్నారు. 5G డౌన్‌లోడ్ స్పీడ్ అధునాతన మార్కెట్‌ల్లో కనిపించే వాటి కంటే ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు.

    details

    అత్యంత వేగవంతమైన టెలికాం నెట్‌వర్క్ విస్తరణలో ఇండియా ఒకటి

    భారతదేశంలో 5G విజయం, ఇక్కడి సాంకేతికత అభివృద్ధి పురోగతిని నొక్కి చెబుతుందని పెకా లుండ్‌బెర్గ్ అన్నారు.

    టెలికమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో దేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.

    భారత్ లో 5G విస్తరణ నిజంగా గొప్పదని,ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన టెలికాం నెట్‌వర్క్ విస్తరణలో ఇండియా ఒకటిని గుర్తు చేశారు.

    ప్రధాన ప్రాంతాలతో పోల్చితే టెలికాం గేర్ షిప్‌మెంట్‌లో క్షీణత ఉందన్నారు.అయినా భారత్ 5G రోల్ అవుట్ ఫలితంగా ఎరిక్సన్,నోకియా వ్యాపార తగ్గుదలని భర్తీ చేయగలిగిందన్నారు.

    2023 జూన్ త్రైమాసికంలో నోకియా 333 శాతం వృద్ధితో రూ. 9,500 కోట్లకు చేరుకోగా, ఎరిక్సన్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఓషియానియా, భారత్ కలిపి రూ. 10,700 కోట్ల నికర అమ్మకాలతో 74 శాతం వృద్ధి సాధించిందన్నారు.

    DETAILS

     90 శాతం వ్యాపారం భారత్ నుంచే వస్తోంది : నోకియా సీఈఓ

    ఇందులో సుమారుగా 90 శాతం వ్యాపారం భారత్ నుంచే వస్తుందన్నారు. JM ఫైనాన్షియల్ నివేదిక ప్రకారం, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ నెట్‌వర్క్‌లను బలోపేతం చేసేందుకు దాదాపుగా రూ.75,000 కోట్ల పెట్టుబడులను సమీకరిస్తున్నాయి.

    FY24లో జియో రూ. 42,000 కోట్లు, ఎయిర్‌టెల్ రూ. 33,000 కోట్లు పెట్టుబడి పెట్టవచ్చని అంచనా. 5G నెట్‌వర్క్ రోల్-అవుట్ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఇన్వెస్ట్ మెంట్లు తగ్గనున్నాయి.

    ఈ ల్యాబ్‌ను కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్‌గా ప్రారంభించారు.అనంతరం భారత్ ను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌లో మరో అడుగు పడినట్టైందన్నారు.

    టెలికాం శాఖ సహకారంతో భారత్ ఇప్పటికే 6Gపై 200కిపైగా పేటెంట్లను పొందడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    స్మార్ట్ ఫోన్

    భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్ భారతదేశం
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన OPPO Find N2 ఫ్లిప్ టెక్నాలజీ
    Realme C33 2023 v/s POCO C55 ఏది కొనడం మంచిది భారతదేశం
    నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025