NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / PM Modi: చంద్రునిపై 2040కల్లా భారతీయుడు.. కుజ, శుక్ర గ్రహ యాత్రలూ జరపబోతున్నాం: మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: చంద్రునిపై 2040కల్లా భారతీయుడు.. కుజ, శుక్ర గ్రహ యాత్రలూ జరపబోతున్నాం: మోదీ 

    PM Modi: చంద్రునిపై 2040కల్లా భారతీయుడు.. కుజ, శుక్ర గ్రహ యాత్రలూ జరపబోతున్నాం: మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపనున్నాడని, అంతేకాక కుజ గ్రహం (మార్స్), శుక్ర గ్రహం (వీనస్) యాత్రలు కూడా చేపట్టనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు.

    ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష అన్వేషణ మహాసభ సందర్భంగా ఆయన పంపిన వీడియో సందేశంలో మాట్లాడుతూ, 2027 నాటికి భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు.

    అలాగే, 2035 నాటికి భూమి కక్ష్యలో భారత్‌కు ప్రత్యేక అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పనున్నామని వివరించారు.

    ప్రస్తుతం కక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు మే 29న భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా చేరనున్నారని మోదీ ప్రకటించారు.

    వివరాలు 

    ఒకే లాంచ్‌లో 100ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఘనత

    ఈ యాత్ర ఇస్రో-నాసా సంయుక్తంగా చేపడుతుండగా, శుభాన్షుతో పాటు ఇతర ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములు కూడా ISS ప్రయాణించనున్నారని వివరించారు.

    1963లో ఒక చిన్నరాకెట్‌తో ప్రారంభమైన భారత అంతరిక్ష ప్రయాణం,చంద్రుని దక్షిణ ధ్రువానికి వ్యోమనౌకను పంపడమే అతిపెద్ద మైలురాయిగా నిలిచిందని ప్రధాని అన్నారు.

    చంద్రుడి ఆ ప్రాంతానికి వ్యోమనౌకను పంపిన మొదటి దేశం భారత్‌గానే నిలిచిందని చెప్పారు.

    అంతేకాకుండా చంద్రునిపై నీటి ఉనికిని గుర్తించిన ఘనత కూడా భారత్‌దేనని వివరించారు.

    అంతేకాక,2014లో తొలిసారి చేసిన ప్రయత్నంలోనే భారత్ కుజ గ్రహాన్ని చేరిన దేశంగా నిలిచిందని చెప్పారు.

    అలాగే ఒకే లాంచ్‌లో 100ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఘనతను కూడా భారత్ సాధించిందని చెప్పారు.

    ఇప్పటివరకు 34దేశాల తరఫున మొత్తం 400ఉపగ్రహాలను ప్రయోగించామని మోదీ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    నరేంద్ర మోదీ

    #NewsBytesExplainer:'విక్టరీ డే' పేరుతో రష్యా వేడుకలు..మోదీకి ఆహ్వానం.. భారత్-చైనా సంబంధాలపై ప్రభావం ఎంత? భారతదేశం
    PM Modi: నేడు కాశీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 44 ప్రాజెక్టులను ప్రారంభించి కాశీ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధాని.. భారతదేశం
    PM Modi: వక్ఫ్‌ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు కాంగ్రెస్
    PM Modi: రైల్వే రంగంలో విప్లవం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరచే ప్రాజెక్ట్‌కు మోదీ శ్రీకారం! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025