Page Loader
Axar Patel: దిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా అక్షర్ పటేల్
దిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా అక్షర్ పటేల్

Axar Patel: దిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గా అక్షర్ పటేల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ (IPL 2025) 18వ సీజన్ ప్రారంభానికి ఇక మరో ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కి ఈ బాధ్యతను అప్పగించింది. టీమ్‌లో సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ,అతడు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఫ్రాంచైజీ అక్షర్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్నిదిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.గత సీజన్‌లో జట్టుకు నాయకత్వం వహించిన రిషభ్ పంత్‌ను ఈసారి నిలువరించిన దిల్లీ, అతడిని విడుదల చేసింది. ఇక లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అతడిని భారీ మొత్తమైన రూ. 27 కోట్లకు తీసుకుని తమ కెప్టెన్‌గా ప్రకటించింది.

వివరాలు 

కీలక ఆల్‌రౌండర్‌గా ఎదుగుతూ.. 

ప్రస్తుతం భారత క్రికెట్‌లో రవీంద్ర జడేజా ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు.అయితే, అతడు ఇప్పటికే టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో జడేజా స్థానాన్నిభర్తీ చేసే ఆటగాడిగా అక్షర్ పటేల్ ముందుకు వస్తున్నాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా,బ్యాటింగ్‌లోనూ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యం అతడికి ఉంది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ తన బ్యాటింగ్ టాలెంట్‌ను ప్రదర్శించాడు. ఐదో స్థానంలో వచ్చి జట్టును ఆదుకున్నఇన్నింగ్స్‌లు ఆడాడు. భారత జట్టు తరఫున ఇప్పటి వరకు 14 టెస్టులు,68వన్డేలు,71టీ20లు ఆడిన అక్షర్,ఐపీఎల్‌లోనూ తన ప్రభావాన్ని చూపించాడు. ఇప్పటి వరకు 15ఐపీఎల్ మ్యాచుల్లో పాల్గొన్న అతడు 1,653పరుగులు చేయడంతో పాటు 123వికెట్లు కూడా తీసుకున్నాడు. ఈ కొత్త బాధ్యతలో అక్షర్ ఎలా రాణిస్తాడో చూడాల్సిందే!