NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs PAK: గ్లోబల్ ఈవెంట్లలో ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో తలపడవా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IND vs PAK: గ్లోబల్ ఈవెంట్లలో ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో తలపడవా?

    IND vs PAK: గ్లోబల్ ఈవెంట్లలో ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో తలపడవా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 25, 2025
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ప్రస్తుతం, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు, భవిష్యత్తులో కూడా అలాంటి సిరీస్‌లను నిర్వహించే ప్రసక్తే లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే స్పష్టం చేశారు.

    ప్రస్తుతం ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే ఆడుతున్నాయి. గ్రూప్ స్టేజ్‌లో భారత్ - పాక్ మ్యాచ్‌లను ఉంచడం వల్ల టోర్నీకి మరింత ఆకర్షణ ఉంటుందనే ఉద్దేశంతోనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకొనేది.

    వివరాలు 

    పాకిస్థాన్‌తో గ్రూప్ స్టేజ్‌లో భారత్ ఆడకూడదని వార్తలు

    అయితే, ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి సంఘటన అనంతరం,పాకిస్థాన్‌తో గ్రూప్ స్టేజ్‌లో భారత్ అసలు ఆడకూడదని టీమిండియా భావిస్తోందని వార్తలు వచ్చాయి.

    ఈ నేపథ్యంలో, ఐసీసీకి లేఖ రాసినట్లు కూడా సమాచారం వచ్చింది.

    భవిష్యత్తులో జరుగనున్న ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నీల్లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండకుండా చూడాలని బీసీసీఐ సూచించిందని తెలుస్తోంది.

    కానీ ఈ విషయంలో బీసీసీఐ అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.

    క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం, టాప్ బీసీసీఐ అధికారులు ఈ విషయంపై ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

    వివరాలు 

    పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలు నిలిపివేయాలని డిమాండ్లు

    ''దేశవ్యాప్తంగా ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలు నిలిపివేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయంలో బీసీసీఐ టాప్ ఆఫీస్‌ బేరర్‌ ఒకరు మాట్లాడారు. చాలా సున్నితమైన అంశం కావడం వల్ల, చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వార్తల్లో ఏ నిజం లేదని భావిస్తున్నా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం'' అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

    వివరాలు 

    ఇవి ఐసీసీ టోర్నీలు

    ఈ ఏడాది ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగింది,దీనికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది.

    భారత్‌కు చెందిన అన్ని మ్యాచులు దుబాయ్ వేదికపై నిర్వహించారు. చివరికి భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.

    ఈ సంవత్సరం ఐసీసీ ఈవెంట్స్‌లో పురుషుల విభాగంలో మరేదీ లేదు.

    వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఐసీసీ టోర్నీ కాకపోయినా, ఆసియా కప్ కూడా అభిమానులను ఆకట్టుకొనే టోర్నీగా ఉంది.

    భారతే ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచులను తటస్థ వేదికపై నిర్వహించాలని బీసీసీఐ మరియు ఏసీసీ భావిస్తున్నాయి.

    మహిళల ప్రపంచ కప్‌ సెప్టెంబర్- అక్టోబర్‌లో జరగనుంది. పాకిస్థాన్ కూడా అర్హత సాధించింది.

    భారత్‌తో జరగనున్న మ్యాచులను తటస్థ వేదికలపై నిర్వహిస్తారా లేదా రద్దు చేస్తారా అన్నది ఇంకా తెలియరాలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    బీసీసీఐ

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    ఐసీసీ

    Jay Shah: ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత.. రంగంలోకి ఐసీసీ ఛైర్మన్‌ జైషా క్రీడలు
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా! క్రీడలు
    ICC Rankings System: క్రికెట్ ప్లేయర్లకు ICC ఇచ్చే ర్యాంకింగ్స్ ను ఎలా లెక్కిస్తుందో తెలుసా?  క్రీడలు
    Siraj Vs Travis Head: ట్రావిస్‌ హెడ్‌, సిరాజ్‌లపై ఐసీసీ సీరియస్ !? మహ్మద్ సిరాజ్

    బీసీసీఐ

    BCCI: బీసీసీఐకి కొత్త కార్యదర్శి, కోశాధికారి.. జనవరి 12న ఎన్నికలు క్రీడలు
    Sana Ganguly: రోడ్డు ప్రమాదం.. గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు సౌరబ్ గంగూలీ
    ICC - Cricket: టెస్టుల్లో '2-టైర్' విధానంపై జై షా ఉత్సాహం.. కొత్త దశలో టెస్టు క్రికెట్ ఐసీసీ
    Champions Trophy 2025: రోహిత్ శర్మకు మరో అవకాశం.. ఛాంపియన్ ట్రోఫీకి కెప్టెన్‌గా కొనసాగించనున్న బీసీసీఐ రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025