Page Loader
BCCI: టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ.. సీనియర్ల భవిష్యత్తు ఏమిటి?
టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ.. సీనియర్ల భవిష్యత్తు ఏమిటి?

BCCI: టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ రివ్యూ.. సీనియర్ల భవిష్యత్తు ఏమిటి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 08, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియా దారుణమైన ప్రదర్శనతో 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలకు దారులు మూసుకుపోయాయి. సీనియర్ ఆటగాళ్లైన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కోచ్ గౌతమ్‌ గంభీర్‌, అతని సహాయక సిబ్బంది పాత్రపై పలు ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా భారత జట్టు ప్రదర్శనపై సమీక్ష చేపట్టనుందని సమాచారం. బీసీసీఐ త్వరలో రివ్యూ మీటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. కానీ సీనియర్లతో పాటు కోచ్‌ పై ఎలాంటి చర్యలు తీసుకోరని తెలుస్తోంది. కోచ్‌గా గంభీర్‌ కొనసాగిస్తారని, అలాగే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇంగ్లాండ్‌ సిరీస్‌లో ఆడతారని తెలిపింది.

Details

ఛాంపియన్ ట్రోఫీపై దృష్టి సారించిన భారత జట్టు

ప్రస్తుతం టీమిండియా దృష్టి ఛాంపియన్స్‌ ట్రోఫీపై నిలిచింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ లో కీలకంగా వ్యవహరించినా, ప్రస్తుతం వారి ఫామ్‌ లేమి వల్ల జట్టు నిరాశకు గురైంది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో కోహ్లీ పెర్త్‌ టెస్టులో సెంచరీ మినహా రాణించలేకపోయాడు. ఈ సిరీస్‌లో అతడు ఎనిమిది సార్లు పెవిలియన్‌ బాట పట్టాడు. రోహిత్‌ శర్మ ప్రదర్శన కూడా నిరాశజనకంగా నిలిచింది, మూడు టెస్టుల్లో మొత్తం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇక గౌతమ్ గంభీర్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది.