NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rohit Sharma: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్‌!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rohit Sharma: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్‌!
    బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్‌!

    Rohit Sharma: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్‌!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 27, 2025
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ కొనసాగింపుపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నా ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అతనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.

    37 ఏళ్ల రోహిత్ శర్మ ఈ కీలక సిరీస్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

    2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనే లక్ష్యంతో భారత జట్టు సిద్ధమవుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభం కానుంది.

    Details

    ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ వైఫల్యం 

    ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతని ప్రదర్శన ఘోరంగా విఫలమై, చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు.

    అయితే అతని నాయకత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడంతో, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అతడే కెప్టెన్‌గా కొనసాగాలని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తోంది.

    న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లను కోల్పోయినా బీసీసీఐ రోహిత్‌పై నమ్మకాన్ని చూపుతోంది.

    Details

     రోహిత్ కెప్టెన్సీలో వరుస ఓటములు 

    న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత, ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు పరాజయం పాలైంది.

    అయినా అతడే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు.

    ఐపీఎల్ 2025 ముగింపు దశలో ఉన్నప్పుడే ఇంగ్లండ్ పర్యటనకు జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది.

    ఇంగ్లండ్ సిరీస్‌కు ఇంకా సమయం ఉండటంతో, అందుబాటులో ఉన్న ఆటగాళ్లపై స్పష్టత రానుంది.

    Details

     టెస్టుల్లో రోహిత్ దారుణ ప్రదర్శన 

    2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి మధ్య జరిగిన 10 టెస్టు మ్యాచ్‌లలో రోహిత్ కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు.

    ఆసీస్ పర్యటనలో అతని ప్రదర్శన మరింత నిరాశపరిచేలా మారింది.

    6.2 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో, అతని టెస్టు కెరీర్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    Details

    బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రశ్నార్థకం 

    భారత ప్రధాన బౌలర్ జస్పిత్ బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

    ఆస్ట్రేలియా పర్యటనలో వెన్ను గాయం కారణంగా అతడు పూర్తిగా కోలుకోలేదని నివేదికలు పేర్కొంటున్నాయి.

    ఐపీఎల్ 2025లోని తొలి మ్యాచ్‌లకు బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

    Details

     45 రోజుల పాటు ఇంగ్లండ్ పర్యటన 

    ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం టీమిండియా మొత్తం 45 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనుంది. జూన్ 20న హెడింగ్లీలో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

    అంతకు ముందు మే 30న కాంటెర్బరీలో సెయింట్ లారెన్స్ గ్రౌండ్‌లో నాలుగు రోజుల మ్యాచ్ జరగనుంది.

    అలాగే, జూన్ 6న నార్తాంప్టన్‌లో మరో ప్రాక్టీస్ మ్యాచ్‌ షెడ్యూల్‌లో ఉంది.

    ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మకు ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఎంతో కీలకం కానుంది. అతని ఫామ్, నాయకత్వ నైపుణ్యం భారత్ విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోహిత్ శర్మ
    బీసీసీఐ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    రోహిత్ శర్మ

    Rohit - Gambhir: రోహిత్ - గంభీర్ మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ శుక్లా  గౌతమ్ గంభీర్
    Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ శర్మ పాకిస్థాన్‌ వెళ్తాడా? లేదా? క్రీడలు
    Rohit Sharma: " టెస్టుల్లో అతడిని చూడటం కష్టమే".. రోహిత్ పై ఆసీస్‌ మాజీ పేసర్ బ్రెట్‌ లీ కీలక వ్యాఖ్యలు క్రీడలు
    Champions Trophy: ఇవాళే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన.. సీనియర్ల భవిష్యత్తుపై క్లారిటీ రానుందా?  భారత జట్టు

    బీసీసీఐ

    SA vs IND: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆ ఇద్దరి ఎంట్రీ ఖాయమే! అసలు విషయం చెప్పేసిన సూర్య  సూర్యకుమార్ యాదవ్
    Champions Trophy 2025: పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరణ.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం  పాకిస్థాన్
    BCCI: భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి భారత జట్టు
    Team India: బుమ్రా, రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర చర్చ .. బీసీసీఐ వీడియో రిషబ్ పంత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025