NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Team India: భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Team India: భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా 
    భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా

    Team India: భవిష్యత్తులో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    01:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించిన నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

    పాకిస్థాన్‌తో భవిష్యత్తులో ఎటువంటి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగవని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తేల్చిచెప్పారు.

    2012-13 సీజన్ తర్వాత నుంచి భారత జట్టు పాక్ మైదానాల్లో అడుగుపెట్టిన సందర్భం లేదు.

    ప్రస్తుతం కూడా కేవలం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే టోర్నీల్లో మాత్రమే తటస్థ వేదికలపై పాకిస్థాన్‌తో తలపడుతోంది.

    ఈ నేపథ్యంలో, ఐసీసీ ఈ వ్యవహారంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని రాజీవ్ శుక్లా సూచించారు.

    వివరాలు 

    దేశంలో ఏర్పడిన పరిస్థితులపై ఐసీసీకి స్పష్టమైన అవగాహన ఉంది 

    "పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా సంఘీభావం తెలుపుతున్నాం. ఈ దాడిని బీసీసీఐ తీవ్రంగా ఖండిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మేము ముందుకు సాగుతాము. ఇప్పటికే పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. ఇకపై కూడా అలాంటి అవకాశం ఉండదు. కానీ ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో ఏర్పడిన పరిస్థితులపై ఐసీసీకి స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను," అని ఆయన వివరించారు.

    వివరాలు 

    పహల్గాం ఘటనపై బీసీసీఐ సంతాపం 

    ఈ దారుణమైన ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రంగా ఖండించారు.

    ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బోర్డు సంతాపాన్ని ప్రకటించింది.

    ఆ మ్యాచ్‌ను ఎలాంటి సంబరాలు లేకుండా నిరాడంబరంగా నిర్వహించారు.

    "ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు పోవడం ఎంతో బాధాకరం. బాధిత కుటుంబాలకు మేము అండగా నిలుస్తాం. ఈ దారుణ ఘటనపై తెలిసిన వెంటనే క్రికెట్ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. బీసీసీఐ తరఫున మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఐక్యంగా స్పందించి, సంఘటితంగా ముందుకెళ్లాలి," అని దేవజిత్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ

    తాజా

    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్

    బీసీసీఐ

    Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌.. భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో..! ఐసీసీ
    BCCI: బీసీసీఐకి కొత్త కార్యదర్శి, కోశాధికారి.. జనవరి 12న ఎన్నికలు క్రీడలు
    Sana Ganguly: రోడ్డు ప్రమాదం.. గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు సౌరబ్ గంగూలీ
    ICC - Cricket: టెస్టుల్లో '2-టైర్' విధానంపై జై షా ఉత్సాహం.. కొత్త దశలో టెస్టు క్రికెట్ ఐసీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025