Page Loader
BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ
లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ

BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 20, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నో సూపర్‌జెయింట్స్‌ స్పిన్నర్‌ దిగ్వేశ్‌ రాఠీపై బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌ అభిషేక్‌ శర్మతో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో దిగ్వేశ్‌ రాఠీపై ఒక మ్యాచ్‌ నిషేధం విధించింది. వికెట్‌ తీసిన తర్వాత హద్దులు దాటి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇదే సీజన్‌లో ఆయనపై ఇది మూడోసారి క్రమశిక్షణ చర్య కావడం గమనార్హం. గతంలో రెండు వేర్వేరు ఘటనలపై ఇప్పటికే జరిమానాల పాలయ్యాడు. ఈసారి ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని మూడవసారి ఉల్లంఘించడంతో బీసీసీఐ ఆయన మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించింది.

Details

దిగ్వేశ్ ఖాతాలో ఐదు డీమెరిట్ పాయింట్ల

అంతేకాక మే 22న అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు సస్పెండ్‌ చేసింది. ప్రస్తుతం దిగ్వేశ్‌ ఖాతాలో ఐదు డీ మెరిట్‌ పాయింట్లు ఉన్నాయి. ఇక అదే మ్యాచ్‌లో దిగ్వేశ్‌తో ఘర్షణకు దిగిన సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మపైనా బీసీసీఐ చర్యలు తీసుకుంది. అభిషేక్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు అతడి ఖాతాలో ఒక డీ మెరిట్‌ పాయింట్‌ను నమోదు చేసింది. మొత్తం మీద మ్యాచ్‌ ఆగ్రహంలో ఇద్దరూ క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొనాల్సి వచ్చింది.