NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!
    ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!

    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఐసీసీ కీలక నిర్ణయం.. హైబ్రిడ్‌కు పచ్చజెండా!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    08:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ (2025) పై ఉన్న సందిగ్ధతను తొలగించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఈ టోర్నీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించగా, భారత మ్యాచ్‌లకు వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

    అంతేకాకుండా, 2027 వరకు జరగనున్న ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ జట్టు విషయంలోనూ హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు ఐసీసీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.

    ఈ నిర్ణయాలు ఐసీసీ చైర్మన్ జై షా, ఇతర బోర్డు సభ్యుల మధ్య గురువారం జరిగిన అనధికార సమావేశంలో తీసుకున్నారని సమాచారం.

    వివరాలు 

    భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో

    2024 ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే, ఈ టోర్నీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఈ నేపథ్యంలో, టీమిండియా మ్యాచ్‌లను పాకిస్థాన్ వెలుపల నిర్వహించేందుకు హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించారు.

    మొదట ఈ ప్రతిపాదనకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒప్పుకోకపోయినా, 2031 వరకు భారత్ ఆతిథ్యమిచ్చే లేదా సహ ఆతిథ్యమిచ్చే టోర్నీల్లో తమ జట్టు మ్యాచ్‌లను కూడా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తామని ఐసీసీ హామీ ఇవ్వడంతో పీసీబీ చివరకు అంగీకరించింది.

    తాజాగా, ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది.

    ఈ నిర్ణయంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయని స్పష్టమైంది.

    వివరాలు 

    శ్రీలంకతో కలిసి భారత్ 

    ఇక 2024 అక్టోబర్‌లో జరగబోయే మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.

    ఈ టోర్నీలో పాకిస్థాన్ మ్యాచ్‌లు భారత్ వెలుపల జరిగే అవకాశముంది. 2026 పురుషుల టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంకతో కలిసి భారత్ నిర్వహించనుంది.

    ఇందులో పాకిస్థాన్ మ్యాచ్‌లకు శ్రీలంక వేదికగా ఉండే అవకాశముంది.

    ''2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్,యూఏఈలో జరుగుతుంది. భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తారు'' అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఐసీసీ

    ICC: శ్రీలంక క్రికెట్‌ను సస్పెండ్ చేసిన ఐసీసీ   శ్రీలంక
    India vs Netherlands: టీమిండియా 9వ విజయం.. నెదర్లాండ్స్‌పై భారీ గెలుపు టీమిండియా
    ICC World Cup 2023 : ప్రపంచ కప్ సెమీ పైనల్స్ షెడ్యూల్ ఇదే.. వేదికలు ఎక్కడంటే? వన్డే వరల్డ్ కప్ 2023
    ICC Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అడుగుమోపిన జట్లు ఇవే..! టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025