Page Loader
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే.. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌ కీలక వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే.. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌ కీలక వ్యాఖ్యలు

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం కష్టమే.. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌పై క్రికెట్ అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది.అయితే ఐసీసీ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ నిర్ణయం తీసుకుంటారని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఈ ట్రోఫీ నిర్వహణపై అనుమానాలను వ్యక్తం చేశాడు. ట్రోఫీ పాకిస్థాన్ ఆతిథ్యంలో జరగాల్సి ఉన్నప్పటికీ, బీసీసీఐ, పీసీబీ మధ్య సయోధ్య కుదరడం లేదు. ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించమంటూ పీసీబీకి ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. లతీఫ్ అభిప్రాయం ప్రకారం, ఈ ట్రోఫీ జరగకపోవడమే మంచిదని, ఐసీసీ కంటే ముందుగా తిరస్కరించాల్సిందిగా పీసీబీకి సూచించాడు.

వివరాలు 

నేడు తుది నిర్ణయం వచ్చేనా? 

భారత్ బాయ్‌కాట్ భయంతో ఏ సంస్థా బీసీసీఐతో పోరాడలేదని, ఈ పరిస్థితిలో పాకిస్థాన్ తన పద్ధతులపై స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నాడు. ఈ రోజు జరగనున్న సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం వెలువడే అవకాశముంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించే సూచనలు కనిపిస్తున్నా, భవిష్యత్తులో భారత్ ఆతిథ్యంలోని మ్యాచ్‌లకు ఇదే మోడల్‌ను అమలు చేయాలని పీసీబీ విజ్ఞప్తి చేసింది. ఐసీసీ ఈ విషయంలో పీసీబీకి లిఖిత పూర్వక హామీ ఇచ్చే అంశంపై చర్చ జరిగే అవకాశముంది.