NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC Champions trophy 2025: 53 శాతం పెరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. విజేతకు రూ.20.8 కోట్లు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    ICC Champions trophy 2025: 53 శాతం పెరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. విజేతకు రూ.20.8 కోట్లు
    53 శాతం పెరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ..

    ICC Champions trophy 2025: 53 శాతం పెరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. విజేతకు రూ.20.8 కోట్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 14, 2025
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌ ఆతిథ్యంలోని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.

    ఇప్పటికే ఎనిమిది జట్లు తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. టీమ్‌ఇండియా మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు.

    తాజా అప్‌డేట్‌గా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ వెల్లడించింది.

    చివరిసారిగా 2017లో ఈ టోర్నీ నిర్వహించగా, అప్పటి కంటే ప్రైజ్‌మనీ దాదాపు 53% పెంచడం గమనార్హం.

    మొత్తం రూ.60 కోట్ల ప్రైజ్‌మనీని జట్లకు కేటాయించనుండగా, చివరి స్థానంలో నిలిచిన జట్టుకూడా రూ.1.22 కోట్లు పొందనుంది.

    ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు అదనంగా రూ.29 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

    వివరాలు 

    2017 ఛాంపియన్స్ ట్రోఫీలో  పాకిస్థాన్‌ 

    ఈసారి ప్రైజ్‌మనీ విభజన ప్రకారం, విజేతగా నిలిచే జట్టుకు రూ.20.8 కోట్లు అందించనున్నారు.

    రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.10.4 కోట్లు కేటాయించనున్నారు. సెమీఫైనల్స్‌ చేరిన ప్రతీ జట్టుకు రూ.5.2 కోట్లు లభించనుండగా, ఐదో, ఆరో స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.3 కోట్లు ఇవ్వనున్నారు. ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.1.2 కోట్లు లభించనున్నాయి.

    గతంలో 2017లో నిర్వహించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో,భారత్‌ను ఓడించి పాకిస్థాన్‌ విజేతగా నిలిచింది.

    ఆ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ జట్టుకు రూ.14.18 కోట్లు ప్రైజ్‌మనీగా లభించగా,రన్నరప్‌గా నిలిచిన భారత్‌ రూ.7 కోట్లు పొందింది.

    సెమీఫైనల్స్‌ చేరిన ఇంగ్లండ్‌,బంగ్లాదేశ్‌ జట్లకు ఒక్కొక్కటీ రూ.3 కోట్లు అందాయి.

    వివరాలు 

    క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా ప్రైజ్‌మనీ

    ఐదో, ఆరో స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు చెరో రూ.58 లక్షలు లభించగా, చివరి రెండు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్లకు చెరో రూ.39 లక్షలు అందాయి.

    ఈసారి ఐసీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంచడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

    ఈ పెరుగుదలతో జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛాంపియన్స్ ట్రోఫీ

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    ఛాంపియన్స్ ట్రోఫీ

    Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్ బీసీసీఐ
    Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం క్రీడలు
    Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ  రోహిత్ శర్మ
    Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..! క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025