NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్
    తదుపరి వార్తా కథనం
    టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్
    బాబర్ అజం, విరాట్ కోహ్లీ

    టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 20, 2023
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బీసీసీఐ పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ జావేద్ మియాందాద్ షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ కి టీమిండియాను పంపేందుకు బీసీసీఐ ఒప్పుకోకపోతే, ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం భారత్‌కి పాక్ ఆటగాళ్లు వెళ్లకూడదని జావేద్ మియాందాద్ పేర్కొన్నారు.

    ఆసియా కప్-2023 నిర్వహణ వివాదం ముగిసి ఈ టోర్నీని సక్సెస్ చేసేందుకు పీసీబీ, ఎస్ఎల్‌సీ సన్మాహాలు చేస్తున్న వేళ అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. పీసీబీ కూడా ప్రతిదానికీ తలొగ్గుతూ దేశం పరువు తీస్తోందని వాపోయారు.

    2012, 2016లో ఇండియాకి పాకిస్తాన్ వచ్చిందని, ఇప్పుడు టీమిండియా వంతు అని, అసియా కప్ కోసం పాకిస్తాన్ కి టీమిండియా ప్లేయర్లు రాకపోతే నరకానికి పోతారని మియాందాద్ వెల్లడించారు.

    Details

    చివరిసారిగా పాక్ లో 2008లో పర్యటించిన టీమిండియా

    తన నిర్ణయం ప్రకారం అయితే ఏ ఒక్క మ్యాచ్ ఆడటానికి కూడా తాను భారత్ కు వెళ్లనని, ఒకవేళ అది ప్రపంచ కప్ అయినా సరేనని, తాము టీమిండియాతో ఆడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, కానీ భారత్ తమలాగా సానుకూల స్పందన ఉండదని మియాందాద్ వివరించారు.

    పాకిస్తాన్ క్రికెట్ చాలా పెద్దదని, తాము ఇప్పటికే చాలా మంది మెరుగైన ఆటగాళ్లను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేశామని, కావున తాము భారత్ కు వెళ్లకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదన్నారు.

    భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్తాన్ లో పర్యటించిన విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన దాడులతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు కూడా నిలిచిపోయాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    క్రికెట్

    తాజా

    Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్  కమల్ హాసన్
    Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం! చంద్రబాబు నాయుడు
    Ladakh: లద్దాఖ్ ప్రజల స్థానికత, రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం లద్దాఖ్
    Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్‌ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు! కమల్ హాసన్

    పాకిస్థాన్

    ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు తాజా వార్తలు
    పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఆప్ఘనిస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో ఆప్ఘాన్ విక్టరీ క్రికెట్
    అరుదైన ఘనతను సాధించిన అఫ్గాన్ బౌలర్ క్రికెట్
    రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..? క్రికెట్

    క్రికెట్

    WTC Final: తొలిరోజు ఆసీసీదే.. విఫలమైన టీమిండియా బౌలర్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు  వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    మరోసారి కన్ఫూజన్‌కు గురైన హర్షా బోగ్లే.. అసలు విషయం తెలిసాక! వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    అప్ఘనిస్తాన్ ను చిత్తుగా ఓడించిన శ్రీలంక.. వన్డే సిరీస్ లంకదే శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025