NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL Expensive Players: ధోనీ నుంచి శామ్ కరన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా
    తదుపరి వార్తా కథనం
    IPL Expensive Players: ధోనీ నుంచి శామ్ కరన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా
    ధోనీ నుంచి శామ్ కరన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా

    IPL Expensive Players: ధోనీ నుంచి శామ్ కరన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2024
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైంది. ఇప్పటివరకూ 16 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

    ఈ నేపథ్యంలో 15 సార్లు ఐపీఎల్ వేలాలు జరిగాయి. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో వేలాన్ని నిర్వహించనున్నారు.

    ఈ క్రమంలో మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

    మొదటగా 2008లో ఐపీఎల్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనిని రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత 2009లో ఆర్సీబీ కెవిన్ పీటర్సన్‌ని రూ.9.8 కోట్లకు, చెన్నై ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను రూ.9.8 కోట్లు వెచ్చించింది.

    Details

    2016 వాట్సన్ కోసం 9.5 కోట్లు ఖర్చు చేసిన ఆర్సీబీ

    ఇక 2010లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున షేన్ బాండ్‌ను రూ.4.8 కోట్లు, ముంబై ఇండియన్స్ తరుపున కీరన్ పొలార్డ్‌ కూడా రూ.4.8 కోట్లకు అమ్ముడుపోయారు.

    2011లో కోల్‌కతా గౌతమ్ గంభీర్‌ను రూ.14.9 కోట్లకు, 2012లో చెన్నై రవీంద్ర జడేజాని రూ.12.8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

    2013లో ముంబై ఇండియన్స్ గ్లెన్ మాక్స్‌వెల్‌ కోసం రూ.6.3 కోట్లు ఖర్చు చేసింది.

    2014లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువరాజ్ సింగ్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.

    2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షేన్ వాట్సన్‌ను రూ.9.5 కోట్లకు తీసుకుంది.

    Details

    24.75 కోట్లు పలికిన మిచెల్ స్టార్క్

    2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ బెన్ స్టోక్స్ కోసం రూ.14.5 కోట్లు, 2019లో రాజస్థాన్ రాయల్స్ జయదేవత్ ఉన్కదత్‌ను రూ.8.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

    2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ పాట్ కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసింది.

    2021లో రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరీస్‌ను రూ.16.25 కోట్లకు, 2022లో ముంబయి ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను రూ.15.25 కోట్లకు వేలంలో దక్కించుకుంది.

    2023లో పంజాబ్ కింగ్స్ శామ్ కరన్‌ను రూ.18.5 కోట్లు, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.

    ఇలా ఐపీఎల్ వేలాలలో పలువురు క్రికెట్ దిగ్గజాలు పెద్ద మొత్తాలకు కొనుగోలు అవుతూనే ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    ఎంఎస్ ధోని

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఐపీఎల్

    IPL 2024 Final KKR vs SRH:వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. హైదరాబాద్, కోల్‌కతా మ్యాచ్ లో ఛాంపియన్ ఎవరు?  క్రీడలు
    IPL 2024 Prize Money: ఐపీఎల్ లో కాసుల వర్షం.. అవార్డుల పూర్తి జాబితా  క్రీడలు
    Punjab Kings : 'పంజాబ్ కింగ్స్'లో విబేధాలు.. ఆయనపై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్ క్రికెట్
    Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. త్వరలోనే అధికారిక ప్రకటన? విరాట్ కోహ్లీ

    ఎంఎస్ ధోని

    రాంచీ వీధుల్లో లగ్జరీ కారుతో ఎంఎస్ ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్  టీమిండియా
    Dhoni: ఎంఎస్ ధోని క్రేజ్ అంటే ఇదే.. వేలంలో రికార్డు ధర పలికిన మహీ బ్యాట్ టీమిండియా
    MS Dhoni : రెప్‌సోల్ 150 బైక్‌పై 'రయ్' మంటూ చక్కర్లు కొట్టిన ధోనీ టీమిండియా
    ఇషాంత్‌ శర్మ అసభ్య పదజాలం వాడాడు.. ధోని రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది: కమ్రాన్ అక్మల్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025