NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND Vs WI: టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. బద్దలైన రికార్డులివే!
    తదుపరి వార్తా కథనం
    IND Vs WI: టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. బద్దలైన రికార్డులివే!
    టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్

    IND Vs WI: టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. బద్దలైన రికార్డులివే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 25, 2023
    10:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్విన్ పార్కర్ ఓవల్లో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచులో టీమిండియా గెలుపు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

    భారీ వర్షంతో చివరి రోజు సోమవారం ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

    టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైస్వాల్, రోహిత్, రవీంద్ర జడేజా, అశ్విన్ అర్ధ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ శతకంతో విజృంభించాడు.

    ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు విండీస్ ఆలౌట్ కావడంతో 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

    Details

    అద్భుతంగా రాణించిన యశస్వీ జైస్వాల్

    సెకండ్ ఇన్నింగ్స్ లో 181 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్ వెస్టిండీస్ ముందు 365 పరుగుల టార్గెట్ ను ఉంచింది. లక్ష్య చేధనకు దిగిన విండీస్ 76/2 స్కోరు చేసింది.

    ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన యశస్వీ జైస్వాల్‌ అద్భుతంగా రాణించాడు. రోహిత్ శర్మతో కలిసి (229, 139, 98) పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

    భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బాజ్‌బాల్‌ను తలపించే విధంగా దూకుడుగా ఆడింది. రోహిత్, జైస్వాల్ 9 ఓవర్లలోనే 90 పరుగులు చేయడం విశేషం.

    500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. టెస్టుల్లో 29 సెంచరీలు చేసి ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మాన్‌ రికార్డును సమం చేశాడు.

    Details

    టెస్టుల్లో వేగవంతమైన ఫిప్టీని నమోదు చేసిన రోహిత్ శర్మ

    ఈ టెస్టు సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. మూడు ఇన్నింగ్స్ లో కలిపి 240 పరుగులు చేశాడు.

    రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ టెస్టు క్రికెట్ లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో రోహిత్ విమర్శకుల నోరు మూయించాడు.

    మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్‌తో విండీస్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టి తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    వెస్టిండీస్

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    టీమిండియా

    టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి షాక్.. కీలక ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు మహ్మద్ షమీ
    Ind Vs WI: డొమినికాకు వెళ్లిన టీమిండియా ప్లేయర్లు వెస్టిండీస్
    నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి! క్రికెట్
    Ind vs Ban Women's T20: హాఫ్ సెంచరీతో చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా ఘన విజయం హర్మన్‌ప్రీత్ కౌర్

    వెస్టిండీస్

    సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ క్రికెట్
    సెంచరీతో కదం తొక్కిన చందర్ పాల్ క్రికెట్
    వెస్టిండీస్‌కి ధీటుగా బదులిచ్చిన జింబాబ్వే, డ్రాగా ముగిసిన మొదటి టెస్టు క్రికెట్
    దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025