
ENG vs IND: ఇంగ్లండ్,భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్.. పటౌడీ ట్రోఫీకి బదులు టెండ్యూలర్-అండర్సన్ ట్రోఫీ
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది.
జూన్ 20న లీడ్స్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్కు రెండు జట్లు కూడా సన్నద్ధమవుతున్నాయి.
ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించగా,తొలి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ 14 మందితో కూడిన తమ జట్టును ఈసీబీ ప్రకటించింది.
ఈ సిరీస్కు గెలిచే జట్టుకు అందించే ట్రోఫీకి టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా పేరు పెట్టనున్నారు. త్వరలోనే ఈ కొత్త ట్రోఫీని అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం.
వివరాలు
సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్ పేరిట కొత్త ట్రోఫీ
గతంలో ఇంగ్లండ్ గడ్డపై భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్లు పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహించేవారు.
భారత మాజీ కెప్టెన్లు ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ,మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల గౌరవార్థంగా ఆ ట్రోఫీకి ఆ పేరు ఇవ్వబడింది.
కానీ ఇప్పుడు ఆ పేరును మార్చాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది.
ఈ నేపథ్యంలో,ఈ ఏడాది మార్చిలో పటౌడీ కుటుంబానికి ఓ లేఖ రాసింది.
ప్రఖ్యాత భారత బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్, ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ పేరిట కొత్త ట్రోఫీని తీసుకొస్తున్నారు.
టెండూల్కర్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు (15,921) చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.
మరోవైపు,అండర్సన్ టెస్ట్లలో అత్యధిక వికెట్లు (704) తీసిన పేసర్గా అత్యద్భుత రికార్డును నెలకొల్పాడు.
వివరాలు
సునీల్ గవాస్కర్ అభ్యంతరం
2007లో ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి టెస్ట్ జరిగిన 75 ఏళ్ల పూర్తి సందర్భంగా పటౌడీ ట్రోఫీని ప్రారంభించారు.
అప్పటినుంచి ఇంగ్లండ్లో జరిగే ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్లకు ఈ ట్రోఫీని ప్రదానం చేస్తూ వస్తున్నారు.
కానీ ఈసారి మాత్రం పటౌడీ ట్రోఫీ స్థానంలో టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీని అందించనున్నారు.
ఈ మార్పుపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
పటౌడీ ట్రోఫీని రిటైర్ చేయాలన్న ఆలోచనను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పునర్విచారించాలని గవాస్కర్ సూచించారు.