Page Loader
IND vs PAK: భారత్ గెలవాలి.. కుంభమేళాలలో ప్రత్యేక పూజలు
భారత్ గెలవాలి.. కుంభమేళాలలో ప్రత్యేక పూజలు

IND vs PAK: భారత్ గెలవాలి.. కుంభమేళాలలో ప్రత్యేక పూజలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్ వేదికగా జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టీమిండియా విజయం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు విజయాన్ని కోరుతూ ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై హారతి ఇచ్చారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన పాకిస్థాన్, ఆత్మవిశ్వాసం కోల్పోయిన తరుణంలో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

Details

గెలుపు కోసం ఎదురుచూస్తున్న అభిమానులు

రిజ్వాన్ నేతృత్వంలోని పాక్ జట్టు ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించి టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయాన్ని అందుకోవాలని అభిమానులు అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.