NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Sreesanth: సంజు శాంసన్‌ విషయంలో వ్యాఖ్యలు.. శ్రీశాంత్‌ను మూడేళ్లపాటు సస్పెండ్ కేరళ క్రికెట్‌ అసోషియేషన్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sreesanth: సంజు శాంసన్‌ విషయంలో వ్యాఖ్యలు.. శ్రీశాంత్‌ను మూడేళ్లపాటు సస్పెండ్ కేరళ క్రికెట్‌ అసోషియేషన్‌
    సంజు శాంసన్‌ విషయంలో వ్యాఖ్యలు.. శ్రీశాంత్‌ను మూడేళ్లపాటు సస్పెండ్ కేరళ క్రికెట్‌ అసోషియేషన్‌

    Sreesanth: సంజు శాంసన్‌ విషయంలో వ్యాఖ్యలు.. శ్రీశాంత్‌ను మూడేళ్లపాటు సస్పెండ్ కేరళ క్రికెట్‌ అసోషియేషన్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    04:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) కఠిన చర్యలు తీసుకుంది.

    అతనిపై మూడేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళ క్రికెట్ లీగ్‌లో పాల్గొంటున్న కొల్లం ఏరీస్ అనే ఫ్రాంఛైజీకి శ్రీశాంత్ సహ-యజమానిగా ఉన్నాడు.

    తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టుకు సంజు శాంసన్‌ను ఎంపిక చేయలేదని, దీనికి కేసీఏనే బాధ్యత వహించాల్సిందని ఆరోపణలు చేసిన శ్రీశాంత్‌పై ఈ చర్యలు తీసుకున్నట్లు అసోసియేషన్ ఏప్రిల్ 30న జరిగిన సమావేశంలో వెల్లడించింది.

    వివరాలు 

    కేసీఏ ప్రతిష్ఠను దెబ్బతీసేలా శ్రీశాంత్ వ్యాఖ్యలు 

    ఒక మలయాళ టెలివిజన్ చానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సంజు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడానికి కేసీఏనే పరోక్షంగా కారణమని వ్యాఖ్యానించాడు.

    విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టులో సంజుకు అవకాశం ఇవ్వకపోవడం వల్లే అతనికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశం దక్కలేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

    అయితే ఈ వ్యాఖ్యలు సంజు శాంసన్‌కు మద్దతుగా చేసినవని కాకుండా, కేసీఏ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని అసోసియేషన్ స్పష్టంచేసింది.

    అందుకే అతనిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.

    వివరాలు 

    సంజు ఎంపిక విషయంలో అసత్య ఆరోపణలు

    అంతేగాక, సంజు ఎంపిక విషయంలో అసత్య ఆరోపణలు చేసిన కారణంగా,అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్‌తో పాటు మరో ఇద్దరిపై నష్టపరిహారం కోసం కేసు దాఖలు చేయాలనే నిర్ణయాన్ని సమావేశంలో సభ్యులు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

    ఇక గతంలో శ్రీశాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, కొల్లం ఏరీస్, అలప్పుళ టీమ్ లీడ్, అలప్పుళ రిప్పల్స్ అనే ఫ్రాంఛైజీలకు షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

    అయితే ఈ ఫ్రాంఛైజీలు తమ సమాధానాలను సమర్పించగా, అవి సంతృప్తికరంగా ఉన్నాయని, అందువల్ల వాటిపై ప్రత్యేక చర్యలు అవసరం లేదని కేసీఏ స్పష్టం చేసింది.

    కానీ ఇకపై జట్లను నిర్వహించే సభ్యులను ఎంపిక చేయడంలో మరింత జాగ్రత్త వహించాలని సూచనలు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంజు శాంసన్

    తాజా

    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    సంజు శాంసన్

    బట్లర్‌కు గాయం.. అందుకే అశ్విన్‌ ఓపెనర్ గా వచ్చాడు : సంజు శాంసన్ ఐపీఎల్
    పాపం.. రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్‌కు ఊహించని షాక్! ఐపీఎల్
    7 నెలల తర్వాత టీమిండియా జట్టులోకి సంజు శాంసన్.. ఈసారైనా! టీమిండియా
    Sanju Samson: సంజూ శాంసన్ చెత్త ఆట.. ఇక భవిష్యత్తులో చోటు కష్టమే! టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025