NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Tom Latham:భారత పర్యటనలో బ్రాండ్‌ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం: టామ్ లేథమ్
    తదుపరి వార్తా కథనం
    Tom Latham:భారత పర్యటనలో బ్రాండ్‌ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం: టామ్ లేథమ్
    Tom Latham:భారత పర్యటనలో బ్రాండ్‌ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం: టామ్ లేథమ్

    Tom Latham:భారత పర్యటనలో బ్రాండ్‌ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం: టామ్ లేథమ్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 10, 2024
    03:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీలంక చేతిలో రెండు టెస్టుల సిరీస్‌ను ఓడిన న్యూజిలాండ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ రేసులో ఉన్న కివీస్‌ ఒక్కసారిగా కిందికి దిగజారింది.

    భారత్‌తో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ నేపథ్యంలో, టిమ్‌ సౌథీ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

    అతడి స్థానంలో టామ్‌ లేథమ్‌ను సారథిగా నియమిస్తూ న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

    ఇప్పటికే స్క్వాడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, తనకు పూర్తిస్థాయిలో సారథ్య బాధ్యతలు అప్పగించడంపై లేథమ్‌ స్పందించాడు.

    భారత్‌తో టెస్టు సిరీస్‌లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. కేర్‌ టేకర్‌గా ఉన్న అతను ఇప్పుడు ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా వచ్చానంటూ వ్యాఖ్యానించాడు.

    వివరాలు 

    సహచరుల మద్దతుతో ముందుకు సాగుతాననే నమ్మకం ఉంది: లాథమ్

    "పూర్తి స్థాయి కెప్టెన్‌గా నా పేరును ప్రకటించడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. గతంలోనే జట్టుకు నాయకత్వం వహించాను, అప్పుడు కేర్‌టేకర్ పాత్రలో ఉండగా, ఇప్పుడు పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. నా దైన శైలిలో కొత్తగా ప్రయత్నించి జట్టును ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ నేను వందశాతం సిద్ధంగా లేను. కానీ, సహచరుల మద్దతుతో ముందుకు సాగుతాననే నమ్మకం ఉంది. భారత్‌తో టెస్టు సిరీస్ తేలికేమీ కాదు. కివీస్ బ్రాండ్‌ క్రికెట్‌ను ఆడి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం" అని లేథమ్ తెలిపాడు.

    వివరాలు 

    సిరీస్‌ ఎప్పటి నుంచి అంటే? 

    భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.

    బెంగళూరు, పుణె, ముంబయి వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియా స్క్వాడ్‌ను ఇంకా సెలక్టర్లు ప్రకటించలేదు.

    కివీస్‌ మాత్రం కేన్‌ విలియమ్సన్‌ లేకుండానే తొలి టెస్టు ఆడనుంది. గాయం నుంచి కోలుకుంటే, తదుపరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు.

    కివీస్ స్క్వాడ్ ఇదే..

    టామ్‌ లేథమ్ (కెప్టెన్),టామ్‌ బ్లండల్ (వికెట్ కీపర్),మైకెల్ బ్రాస్‌వెల్ (తొలి టెస్టుకు),మార్క్‌ చాప్‌మన్, డేవన్ కాన్వే,మ్యాట్ హెన్రీ,డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బీన్ సీర్స్, ఐష్ సోధి (2, 3 టెస్టులకు), టిమ్‌ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టామ్ లేథమ్
    న్యూజిలాండ్

    తాజా

    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా
    ACUTE FOOD INSECURITY IN PAKISTAN: ఆహార సంక్షోభంలో పాక్‌.. 11మిలియన్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం: FAO పాకిస్థాన్
    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా

    టామ్ లేథమ్

    టెస్టు క్రికెట్లో రికార్డుకు చేరువలో టామ్ లాథమ్ న్యూజిలాండ్

    న్యూజిలాండ్

    NZ Vs BAN : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు బంగ్లాదేశ్
    NZ Vs BAN: న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం బంగ్లాదేశ్
    న్యూజిలాండ్ ఎన్నికల్లో నేషనల్ పార్టీ విజయం.. తదుపరి ప్రధానిగా 'లక్సన్'  తాజా వార్తలు
    NZ Vs AFG : బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్‌నిస్తాన్.. మరోసారి సంచలనం సృష్టిస్తుందా! ఆఫ్ఘనిస్తాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025