Page Loader
IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌!
నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌!

IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు ఒక నిబంధనను ఉల్లంఘించిందని అంపైర్లు గుర్తించి, వారికి నోబాల్‌ను పెనాల్టీగా విధించారు. ఈ ఘటన అయిదో ఓవర్‌లో మూడో బంతికి సంభవించింది.దిల్లీ బౌలర్ విల్‌ జాక్స్‌ వేసిన ఆ బంతిని ముంబయి బ్యాట్స్‌మన్ విప్రాజ్‌ నిగమ్‌ ఎదుర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఫీల్డింగ్‌ అమరికలో లోపం ఉండటాన్ని అంపైర్లు గమనించారు. ఆఫ్సైడ్‌లో కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం, ఎందుకంటే నిబంధనల ప్రకారం ఆన్‌సైడ్‌లో ఐదుగురు కంటే ఎక్కువ మంది ఫీల్డర్లు ఉండకూడదు. ఫీల్డింగ్‌లో ఈ తప్పిదం కారణంగా ఆ బంతిని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించారు.

వివరాలు 

ఐపీఎల్ నుండి నిష్క్రమించిన దిల్లీ క్యాపిటల్స్‌

మ్యాచ్‌ ఫలితానికి వస్తే... ముంబయి ఇండియన్స్‌ జట్టు ఆకట్టుకునే ఆటతీరుతో విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఈ పరుగుల ఛేదనలో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కేవలం 18.2 ఓవర్లలోనే 121 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో ముంబయి ఇండియన్స్‌ 59 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్‌ యాదవ్‌ అజేయంగా 73 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనకు గాను అతడిని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ప్రకటించారు. ఈ విజయం ముంబయికి ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించిపెట్టగా, దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు పోటీలో నుంచి బయటపడింది.