NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో శీతల్‌ దేవి శుభారంభం.. నేరుగా ప్రిక్వార్టర్స్‌లో చోటు 
    తదుపరి వార్తా కథనం
    Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో శీతల్‌ దేవి శుభారంభం.. నేరుగా ప్రిక్వార్టర్స్‌లో చోటు 
    పారాలింపిక్స్‌లో శీతల్‌ దేవి శుభారంభం

    Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో శీతల్‌ దేవి శుభారంభం.. నేరుగా ప్రిక్వార్టర్స్‌లో చోటు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 30, 2024
    11:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తొలిసారి పారిస్ పారాలింపిక్స్‌ బరిలో దిగిన శీతల్‌ అరుదైన రికార్డు సాధించింది. 17 ఏళ్ల జమ్ముకశ్మీర్‌ పారా ఆర్చర్‌ గురువారం మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో 720లో 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి, నేరుగా ప్రిక్వార్టర్స్‌కి చేరుకుంది.

    కాలితో విల్లును పట్టి, భుజంతో నారిని లాగి బాణాలు విసిరే శీతల్‌ ఈ మొదటి అడుగులోనే మెప్పించింది.

    59 సార్లు 10 పాయింట్లు సాధించిన ఆమె, 24 సార్లు ఎక్స్‌కి (లోపలి వృత్తానికి దగ్గరగా) గురిపెట్టింది.

    తుర్కియేకు చెందిన ఒజ్నుర్‌ గిర్డి (704) ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచింది.ఈ రౌండ్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆర్చర్లు నేరుగా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తారు.

    వివరాలు 

    బ్యాడ్మింటన్‌లో సత్తా చాటిన భారత్  

    శనివారం ప్రిక్వార్టర్స్‌లో శీతల్‌ జునిగా (చిలీ) లేదా చోయ్‌ నా మి (కొరియా)తో తలపడుతుంది. మరో భారత పారా ఆర్చర్‌ సరిత (682) తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది.

    పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్లో టోక్యో పారాలింపిక్స్‌ కాంస్య విజేత హర్విందర్‌ సింగ్‌ (637) 9వస్థానంలో నిలిచాడు.బుధవారం తొలి రౌండ్లో అతను సెంగ్‌ (చైనీస్‌ తైపీ)ను ఢీకొడతాడు.

    మరోవైపు బ్యాడ్మింటన్‌లో మొదట రోజు భారత్ సత్తాచాటింది. భారత పారా షట్లర్లు సుకాంత్‌, సుహాస్‌, తరుణ్‌ పారాలింపిక్స్‌లో అదరగొట్టారు.

    పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 విభాగంలో గ్రూప్‌-బిలో సుకాంత్‌ 17-21, 21-15, 22-20 తేడాతో అమిన్‌ (మలేసియా)పై విజయం సాధించాడు.

    వివరాలు 

    మహిళల సింగిల్స్‌

    గ్రూప్‌-డిలో తరుణ్‌ 21-17, 21-19తో జేవియర్‌ (బ్రెజిల్‌)పై గెలిచాడు, గ్రూప్‌-ఏలో సుహాస్‌ 21-7,21-5తో హిక్మత్‌ (ఇండోనేషియా)పై సునాయాసంగా గెలిచాడు.

    ఎస్‌ఎల్‌3 సింగిల్స్‌ గ్రూప్‌-ఏలో నితేశ్‌ కుమార్‌ 21-13, 18-21, 21-18తో మనోజ్‌ సర్కార్‌ను ఓడించాడు.ఎస్‌హెచ్‌6 గ్రూప్‌-ఏలో శివరాజన్‌ 15-21, 17-21తో సుభాన్‌ (ఇండోనేషియా) చేతిలో ఓడిపోయాడు.

    మహిళల సింగిల్స్‌లో ఎస్‌యూ5 గ్రూప్‌-ఏలో తులసిమతి 21-9, 21-11తో రోసా (ఇటలీ)పై, గ్రూప్‌-బిలో మనీష 8-21, 21-6, 21-19తో లెఫోర్ట్‌ (ఫ్రాన్స్‌)పై, ఎస్‌ఎల్‌4 గ్రూప్‌-సిలో పలక్‌ కోహ్లి 21-12, 21-14తో మిలెనా (ఫ్రాన్స్‌)పై, ఎస్‌హెచ్‌6 గ్రూప్‌-ఏలో నిత్యశ్రీ 21-7, 21-8తో సిమన్‌ (అమెరికా)పై విజయం సాధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పారిస్ పారాలింపిక్స్‌

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    పారిస్ పారాలింపిక్స్‌

    Paris Paralympics 2024: స్పోర్ట్స్ డే నాడు ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్‌  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025