NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Pr Sreejesh: శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    Pr Sreejesh: శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం 
    శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం

    Pr Sreejesh: శ్రీజేష్‌కు భారీ నజరానా ప్రకటించిన కేరళ ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 22, 2024
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత హాకీ గోల్‌కీపర్‌గా పేరుగాంచిన పీఆర్‌ శ్రీజేష్‌కు కేరళ ప్రభుత్వం బుధవారం రూ.2కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.

    ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

    ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నశ్రీజేష్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత 2కోట్ల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని పేర్కొంది.

    ప్యారిస్‌లో భార‌త హాకీ జట్టు కాంస్య ప‌త‌కం సాధించ‌డంలో శ్రీజేష్‌ది కీల‌క పాత్ర‌ పోషించాడు. బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీజేష్‌ కోట గోడలా నిలిచి బ్రిటన్‌కు ఎక్స్‌ట్రా గోల్‌ చేసే ఛాన్స్‌ ఇవ్వలేదు.

    వివరాలు 

    భారత హాకీ జట్టుపై కాసుల వర్షం కురిపించిన ఒడిశా ముఖ్యమంత్రి 

    ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ జట్టు సభ్యులకు నగదు పురస్కారాలను ప్రకటించారు.

    రాష్ట్ర స్టార్ ఆటగాడు అమిత్ రోహిదాస్ 4 కోట్ల రూపాయలు, భారత గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు రూ.50 లక్షలు, జట్టులోని ఇతర ఆటగాళ్లకు రూ.15 లక్షలు అందజేశారు.

    సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.10లక్షలు అందజేశారు.

    పారిస్ ఒలింపిక్స్‌లో గెలవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నపటికీ సెమీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓడిపోవడం దురదృష్టకరమని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ బుధవారం అన్నారు.

    అయితే దీనితో పాటు వరుసగా రెండో కాంస్య పతకాన్ని సాధించడం పెద్ద విజయంగా పేర్కొన్నాడు.

    పారిస్‌లో స్పెయిన్‌ను ఓడించి భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. తద్వారా టోక్యో ఒలింపిక్ క్రీడల ప్రదర్శనను పునరావృతం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్! ఫెరారీ
    Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Sushmita Sen: 31 ఏళ్ల క్రితం ఫొటో షేర్‌ చేసిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్

    కేరళ

    CAA ని నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్  సుప్రీంకోర్టు
    Kerala: కేరళలో ఫుట్‌బాల్ ఆటగాడిపై దాడి.. కేసు నమోదు భారతదేశం
    Russia election 2024: రష్యా అధ్యక్ష ఎన్నికలు .. కేరళలో ఓటింగ్.. ఎందుకో తెలుసా..?  రష్యా
    Kerala: లారీ నుంచి జారిపడ్డ 'బండ రాయి'.. వైద్య విద్యార్థి మృతి.. డ్రైవర్ అరెస్ట్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025