NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Paris Paralympics 2024: భారత్‌కు మూడో పతకం.. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్యం
    తదుపరి వార్తా కథనం
    Paris Paralympics 2024: భారత్‌కు మూడో పతకం.. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్యం
    భారత్‌కు మూడో పతకం.. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్యం

    Paris Paralympics 2024: భారత్‌కు మూడో పతకం.. 100 మీటర్ల ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్యం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 30, 2024
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ తన మూడో పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

    14.21 సెకన్లలో రేసును పూర్తి చేసి, వ్యక్తిగతంగా మెరుగైన రికార్డును నెలకొల్పింది. పారాలింపిక్స్ 2024లో భారత్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఇదే తొలి పతకం కావడం గమనార్హం.

    ఈ రేసులో చైనా అథ్లెట్లు స్వర్ణం,రజత పతకాలను సొంతం చేసుకున్నారు. జియా జౌ 13.58 సెకన్లలో రేసును ముగించి స్వర్ణ పతకం సాధించగా, గౌ 13.74 సెకన్లలో రజత పతకాన్ని అందుకుంది.

    వివరాలు 

    షూటింగ్ విభాగంలో రెండు పతకాలను గెలిచిన భారత ఆటగాళ్లు 

    అంతకుముందు, ఇవాళ జరిగిన షూటింగ్ విభాగంలో భారత ఆటగాళ్లు రెండు పతకాలను గెలిచారు.

    మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్‌-1 విభాగంలో అవని లేఖర స్వర్ణ పతకాన్ని సాధించడంతో పాటు తన గత రికార్డును మెరుగుపర్చింది.

    అవని టోక్యో పారాలింపిక్స్‌లో కూడా స్వర్ణ పతకాన్ని గెలిచింది. మరోవైపు, మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

    పారాలింపిక్స్‌లో మొదటిసారిగా పాల్గొన్న మోనా, తన తొలి విశ్వక్రీడల్లోనే కాంస్య పతకాన్ని సాధించి భారత షూటింగ్ రంగంలో భవిష్యత్ తారగా ఎదిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పారిస్ పారాలింపిక్స్‌

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పారిస్ పారాలింపిక్స్‌

    Paris Paralympics 2024: స్పోర్ట్స్ డే నాడు ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్‌  క్రీడలు
    Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో శీతల్‌ దేవి శుభారంభం.. నేరుగా ప్రిక్వార్టర్స్‌లో చోటు  క్రీడలు
    Avani Lekhara: పారాలింపిక్స్‌ షూటింగ్ లో భారత్ కు గోల్డ్  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025