Page Loader
IND vs ENG: చారిత్రాత్మక ఫీట్ సాధించిన అశ్విన్.. 45 ఏళ్ళ రికార్డు బ్రేక్ 
చారిత్రాత్మక ఫీట్ సాధించిన అశ్విన్.. 45 ఏళ్ళ రికార్డు బ్రేక్

IND vs ENG: చారిత్రాత్మక ఫీట్ సాధించిన అశ్విన్.. 45 ఏళ్ళ రికార్డు బ్రేక్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2024
01:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ లెజెండరీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్‌ను అధిగమించాడు.ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై అశ్విన్ 96 వికెట్లు పడగొట్టాడు. భగవత్ చంద్రశేఖర్ 1964-79 మధ్య ఇంగ్లండ్‌పై టెస్టుల్లో 95 వికెట్లు పడగొట్టాడు. 45 ఏళ్ల పాటు ఈ రికార్డు చంద్రశేఖర్ పేరుపై ఉండగా.. తాజాగా ర‌విచంద్ర‌న్ అశ్విన్ బ్రేక్‌ చేశాడు. ఇంగ్లండ్‌తో డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్టణంలో జరిగిన భారత్ రెండో టెస్టులో 4వ రోజు ఆఫ్ స్పిన్నర్ ఈ రికార్డు సృష్టించాడు.

Details 

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన అశ్విన్

రెండో ఇన్నింగ్స్‌లో,మూడో రోజు బెన్ డ‌కెట్‌(28)ను ఔట్ చేసిన అశ్విన్..నాలుగో రోజు రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్‌ను పోటీలోకి తెచ్చాడు. ప్ర‌మాద‌క‌ర‌మైన ఓలీ పోప్ (23),జో రూట్‌(16)ల‌ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం భారత్,ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు, అశ్విన్ 36 టెస్టుల్లో,2.69ఎకానమీ రేటుతో 144 వికెట్లు(6 ఐదు వికెట్ల హాల్‌)తీశాడు. అశ్విన్ భారత జట్టులో బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా పని చెప్పాడు. 2021లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.